మరమ్మతులకు ముందు
మరమ్మతుల తర్వాత
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అవుట్ పేషెంట్ బ్లాక్ వైపు ఉన్న సుభాష్రోడ్డులోని గేటుకు ఎట్టకేలకు మరమ్మతులు చేయించారు. దీంతో రాకపోకలకు అనుకూలంగా మారడంతో రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ గేటు దెబ్బతినడంతో రాకపోకల విషయంలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈనెల 6న ‘ఆస్పత్రి గేటిలా.. రాకపోకలెలా?’ శీర్షికన, ఈనెల 12న ‘మరమ్మతులు మరిచి.. నో ఎంట్రీతో సరి’ శీర్షికన ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో ఆస్పత్రి అధికారులు స్పందించి, గేటుకు మరమ్మతులు చేయించారు. దీంతో రోగులకు ఇబ్బందులు తొలిగాయి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి


