పిట్లం/సదాశివనగర్/నస్రుల్లాబాద్ : పదో తరగతి విద్యార్థులకు శనివారం పలు చోట్ల పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. పిట్లం బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు.సదాశివనగర్ మండలం పద్మాజీవాడి ఉన్నత పాఠశాలలో మోడెగాం గ్రామ సర్పంచ్ గౌడెల్లి గంగాధర్ టెన్త్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లను వితరణ చేశారు.నస్రుల్లాబాద్ మండలంలోని పలు జెడ్పీహెచ్ఎస్ల్లో ఎంఈవో చందర్ నాయక్ కోనేరు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు మాట్లాడారు.


