సమస్యలను వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Jul 15 2025 7:01 AM | Updated on Jul 15 2025 7:03 AM

కామారెడ్డి క్రైం: ప్రజావాణి ద్వారా దృష్టికి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూసమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్‌ కార్డుల మంజూరుకు సంబంధించిన వినతులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. పెండింగ్‌ ఫిర్యాదులు లేకుండా చూసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్లు విక్టర్‌, చందర్‌ నాయక్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

ప్రజావాణికి 95 ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement