అర్గుల్‌ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకం | - | Sakshi
Sakshi News home page

అర్గుల్‌ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకం

Jun 5 2025 7:34 AM | Updated on Jun 5 2025 7:34 AM

అర్గుల్‌ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకం

అర్గుల్‌ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకం

మీకు తెలుసా?

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ను ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.204 కోట్ల వ్యయంతో నిర్మాణం పనులు చేపట్టి పూర్తి చేయించారు.●

● 2008 మార్చి 18న వైఎస్సార్‌ స్వహస్తాలతో అర్గుల్‌ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకంగా నామకరణం చేసి ప్రారంభించారు.

● ఆర్మూర్‌ ప్రాంత బీసీ నాయకుడు, మాజీ మంత్రి అర్గుల్‌ రాజారాంకు ఇచ్చిన అరుదైన గౌరవం ఇది.

● ఆర్మూర్‌, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల పరిధిలోని మాక్లూర్‌, నందిపేట్‌, ఆర్మూర్‌, బాల్కొండ, వేల్పూర్‌, జక్రాన్‌పల్లి మండలాల్లోని 53 గ్రామాల్లో 38 వేల 792 ఎకరాల ఆయకట్టు స్థీరీకరణ అయింది.

● నందిపేట మండలం ఉమ్మెడ శివారులో నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోని గోదావరి నదీ జలాలు 22.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుత్ప చెరువు మీదుగా ఆర్మూర్‌ ప్రాంత వ్యవసాయ భూములకు అందుతుండటంతో రైతులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. – ఆర్మూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement