ప్రభుత్వ బడికోసం ఏకమైన ఊరు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడికోసం ఏకమైన ఊరు

May 26 2025 12:49 AM | Updated on May 26 2025 12:49 AM

ప్రభు

ప్రభుత్వ బడికోసం ఏకమైన ఊరు

కామారెడ్డి రూరల్‌: ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూస్తున్న ఈ రోజుల్లో తమ పిల్లలను సర్కార్‌ బడికే పంపాలని నిర్ణయించుకొని అందరికి ఆదర్శంగా నిలిచారు కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామస్తులు. తమ గ్రామానికి చెందిన పిల్లలు ప్రైవేటు బడికి పంపకుండా సర్కార్‌ బడికి పంపాలని తీర్మాణం చేశారు. గ్రామంలో ఉన్న మండల పరిషత్‌ ప్రభుత్వ పాఠశాల బాధ్యతను గ్రామస్తులంతా తమ భుజాలపై వేసుకున్నారు. తాము ప్రభుత్వ బడిలోనే చదివి ప్రయోజకులమయ్యాం కాబట్టి మా పిల్లలను కూడా ప్రైవేట్‌ స్కూల్‌కి పంపకుండా, ప్రభుత్వ బడిలోనే చదివిస్తామని నిర్ణయం తీసుకున్నారు. నలుగురు ప్రభుత్వ టీచర్స్‌తో పాటు కొత్తగా ఇద్దరు విలేజ్‌ వలంటీర్లను, ఒక ఆయాను, ప్రస్తుతం ఉన్న టీచర్స్‌కు అనుసంధానం చేస్తూ బడిని బాగు చేశారు. ప్రస్తుతం నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం లో బోధన జరుగుతోంది. గ్రామస్తులు దాతల సహకారంతో దాదాపు రూ. 7 లక్షల వరకు కొత్తగా మూడు గదుల నిర్మాణంతో పాటు డ్యూయల్‌ బెంచీలు, ఫ్యాన్స్‌, కరెంట్‌, రూమ్‌కి రంగులు, డిజైన్‌లు, నేమ్‌ బోర్డులు ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. ఇంకా బడిలో కావాల్సిన అవసరాల కోసం, ఫ్యాన్లు, బెంచీలు, అదనపు తరగతి గదులు, వాటికి రంగు రంగుల బొమ్మలు, ఇతర ఖర్చులకు రూ. 3 లక్షలు అవుతాయని అంచనా వేశారు. వాటిని చందాలు వేసి సేకరించేందుకు పాఠశాల యాజమాన్యంతో కలిసి ప్రణాళిక సిద్ధం చేశారు. ఉన్న టీచర్లకు అనుసంధానంగా మరో ఇద్దరు వలంటీర్లను జత చేసి ఇంగ్లిష్‌ మీడియం బోధించే దిశగా చర్యలు చేపట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. మన బడి మన బాధ్యత అంటూ ప్రభుత్వ పాఠశాలకు మద్దతుగా నిలిచిన తీరు మండలంలో హాట్‌ టాపిక్‌గా మారింది. గతేడాది స్కూల్‌లో 27 మందే ఉండగా ఈసారి 132 మంది అయ్యారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా ఈ సంఖ్యను 200 చేర్చేందుకు గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తులు కుర్మిండ్ల ప్రభాకర్‌గౌడ్‌, ఆనంద్‌గౌడ్‌, భూపతి, సంగి రాజు తదితరులు స్కూల్‌ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

క్యాసంపల్లిలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల

పిల్లలను ప్రైవేటు పాఠశాలకు

పంపించేది లేదని గ్రామస్తుల నిర్ణయం

చేయిచేయి కలుపుతూ

ఐక్యంగా ముందడుగు

ప్రభుత్వ బడిలోనే చదివాం

తాము ప్రభుత్వ బడిలోనే చదివి ప్రయోజకులమయ్యాం. మా పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేలా ఊరంతా కలిసి నిర్ణయం తీసుకున్నాం. చందాలు వసూలు చేసి మూడు అదనపు తరగతి గదులు, రంగులు, బెంచీలు, వలంటీర్లను ఏర్పాటు చేశాం.

– కుర్మిండ్ల ప్రభాకర్‌గౌడ్‌, క్యాసంపల్లి

ప్రభుత్వ బడికోసం ఏకమైన ఊరు 1
1/2

ప్రభుత్వ బడికోసం ఏకమైన ఊరు

ప్రభుత్వ బడికోసం ఏకమైన ఊరు 2
2/2

ప్రభుత్వ బడికోసం ఏకమైన ఊరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement