
హైవేపై ఢీకొన్న లారీలు
డిచ్పల్లి: మండలంలోని దేవుపల్లి క్యాంప్ గ్రామం సమీపంలోగల 44వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం రెండు లారీలు ఢీకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. హైదరాబాద్ వైపు నుంచి నాగ్పూర్ వైపు రెండు లారీలు బయలుదేరాయి. దేవుపల్లి క్యాంప్ సమీపంలో ముందున్న లారీని వెనుకున్న లారీ ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. దీంతో రహదారిపై చాలా సేపు ట్రాఫిక్ స్తంభించింది. పో లీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన లారీలను క్రేన్ సాయంతో పక్కకు తొలగించి వాహన రాకపోకలను క్రమబద్దీకరించారు. రెండు లారీలు ఢీకొన్న సమయంలో వాటిలో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో ఇతర వాహనాలు వాటిని ఢీకొన్నట్లయితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మొరం ట్రాక్టర్లు, పొక్లెయిన్ సీజ్
నిజాంసాగర్ (జుక్కల్): మండల కేంద్రం శివారులో మొరం తవ్వకాలు చేపడుతున్న పొక్లెయిన్ను, మొరం తరలిస్తున్న ట్రాక్టర్లను ఎస్సై శివకుమార్ ఆదివారం పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు చేపడుతూ, రవాణా చేయడంతో వాహనాలను సీజ్ చేసి, స్టేషన్కు తరలించినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

హైవేపై ఢీకొన్న లారీలు