ఎల్లారెడ్డి/ నిజాంసాగర్/ సదాశివనగర్: జిల్లాలోని పలు మండలాల బీజేపీ నూతన అధ్యక్షులను పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు నియమించి ఉత్తర్వులను గురువారం జారీ చేశారు. ఎల్లారెడ్డి రూరల్ మండల అధ్యక్షుడిగా పెద్దెడ్ల నర్సింలు, మ హమ్మద్నగర్ మండల అధ్యక్షుడిగా దమనబోయిన శ్రీకాంత్, పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా కొండా అనిల్ గుప్తా, సదాశివనగర్ మండలం అధ్యక్షుడిగా కుంట రాంరెడ్డి నియామకం అయ్యారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
సహకార వ్యవస్థ ముఖ్యమైంది
డొంకేశ్వర్(ఆర్మూర్): సొసైటీలో సహకార సంఘాల వ్యవస్థ, పాత్ర ముఖ్యమైనదిగా మారిందని డీసీవో శ్రీనివాస్ రావు అన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని గురువారం నగరంలోని సుభాష్నగర్ ప్రభుత్వ ఉద్యోగుల హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ భవనంలో సమావేశం నిర్వహించారు. డీసీవో ముఖ్య అతిథిగా హాజరై, సహకార చట్టం, పాలనపై సభ్యులకు అవగాహన కల్పించారు. సొసైటీ సభ్యులు శంకర్రెడ్డి, దత్తాత్రేయ, ప్రభాకర్రెడ్డి, జగత్రెడ్డి, కోటేశ్వర్ రావు పాల్గొన్నారు.
బీజేపీ మండల అధ్యక్షుల నియామకం
బీజేపీ మండల అధ్యక్షుల నియామకం
బీజేపీ మండల అధ్యక్షుల నియామకం
బీజేపీ మండల అధ్యక్షుల నియామకం