
పనులను వేగవంతం చేయాలి
కామారెడ్డి క్రైం: మహిళా శక్తి భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ వెనుక ప్రాంతంలో కొనసాగుతున్న భవన నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం పరిశీలించారు. రూ. 5 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించాలని, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు వి విక్టర్, చందర్, పంచాయతీ రాజ్ ఈఈ దుర్గా ప్రసాద్ తదితరులు ఉన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. సాధారణ పరిశీలనలో భాగంగా గోదాంను సందర్శించిన ఆయన రికార్డులను తనిఖీ చేశారు. భద్రతపై పలు సూచనలు చేశారు. ఆయనవెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ, డీటీ అనిల్ తదితరులున్నారు.