
చిన్న పోతంగల్లో దొంగల హల్చల్
గాంధారి: మండలంలోని చిన్న పోతంగల్ గ్రామంలో మంగళవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన కొర్రి గౌరవ్వ రాత్రి ఆరుబయట నిద్రించగా వర్షం రావడంతో ఇంట్లోకి వెళ్లిది. కానీ తలుపులకు గడియ వేయడం మరిచిపోయింది. ఇదే అదనుగా ఇద్దరు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కత్తితో బెదిరించారు. నగదు, 12 తులాల వెండి, గౌరవ్వ మెడలో నుంచి బంగారు గుండ్లు లాక్కుని పరారయ్యారు. మరో కాలనీలో ఉండే కుమ్మరి రోజా ఇంటికి తాళం వేసి అదే గ్రామంలోని తన తల్లిగారింటికి వెళ్లింది. ఉదయం ఆమె ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు సమాచారం ఇచ్చారు. ఇంట్లో దాచిన ఏడున్న ర మాసాల బంగారం, 12 తు లాల వెండి, కొంతనగదు చోరీకి గురైనట్లు రోజా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘట నా స్థాలాన్ని స దాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, గాంధారి ఎస్సై ఆంజనేయులు పరిశీలించి విచారణ జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.