సాగర్‌ అందాలు ఇక కనుమరుగేనా? | - | Sakshi
Sakshi News home page

సాగర్‌ అందాలు ఇక కనుమరుగేనా?

May 8 2025 9:11 AM | Updated on May 8 2025 9:11 AM

సాగర్

సాగర్‌ అందాలు ఇక కనుమరుగేనా?

నిజాంసాగర్‌(జుక్కల్‌): నిజాం నవాబు కట్టినటువంటి నిజాంసాగర్‌ ప్రాజెక్టు చరిత్ర రోజురోజుకు కనమరుగవుతుంది. ఆనాటి కట్టడాలు చెక్కుచెదరకుండా ఉన్నా, ఉన్నతాధికారుల పర్యవేక్ష కొరవడడంతో సరైన నిర్వహణ లేకపోవడంతో మూతపడుతున్నాయి. అప్పట్లో ఎండకాలం వచ్చిందంటే చాలు ప్రజలు ఆహ్లాదం కోసం నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వచ్చేవారు. ఇప్పుడు నిజాంసాగర్‌ ప్రాజెక్టు అందాల జాడేదీ అన్నట్లుగా మారాయి.

ప్రాజెక్టుకు ఘన చరిత్ర

నిజాంసాగర్‌ మండలం అచ్చంపేట, బంజపల్లి గ్రామాల పరిధిలో 1923–31లో నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మించారు. నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ ప్రధాన ఇంజినీర్‌ పర్యవేక్షణలో ‘ఎన్‌’ ఆకారంలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మితమైంది. 1405.05 అడుగులు 30 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించగా 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు, బాన్సువాడ, బోధన్‌, నిజామాబాద్‌ పట్టణాలకు తాగునీరు అందిస్తోంది. ఇంతటి ఘనమైన చరిత్ర కల్గిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది.

వేసవిలో పర్యాటక ప్రాంతం..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాల నుంచి వందలాది మంది పర్యాటకులు నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు తరలివస్తారు. ముఖ్యంగా వేసవి కాలంలో విహారయాత్ర కోసం నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పర్యాటకుల కోసం నిజాంసాగర్‌ ప్రాజెక్టు దిగువన సమ్మర్‌ బాగ్‌తో పాటు స్విమ్మింగ్‌ పూల్‌, వాటర్‌ ఫౌంటెయిన్‌ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు సందర్శన కు వచ్చిన పర్యాటకులు సమ్మర్‌ బాగ్‌కు వెళ్లి సమ్మర్‌లో లభించే అన్ని రకాల పండ్లు, కాయల రుచిచూసేవారు. అంతేకాకుండా స్విమ్మింగ్‌ పూల్‌లో చిన్నారులు స్విమ్మింగ్‌ చేయడం, వాటర్‌ ఫౌంటెయిన్‌ వ ద్ద సరదాగా సమయం గడిపేవారు. అయితే ప్రస్తు తం సమ్మర్‌ బాగ్‌లో పండ్ల రకాల చెట్లు అంతరించిపోవడంతో సమ్మర్‌ బాగ్‌ పేరు కనుమరుగయింది. అలాగే స్విమ్మింగ్‌ పూల్‌, వాటర్‌ ఫౌంటెన్‌ ఉన్నా వాటికి నీటి సరఫరా లేకపోవడంతో దశబ్దాల కాలం నుంచి అవి మూలనపడ్డాయి. పర్యాటకులకు ఇక్కడ బోటు షికారు అప్పట్లో అందుబాటులో ఉండేది. జిల్లా అధికారుల అనుమతితో ఇక్కడ బోటు షికారు చేయించేవారు. అయితే కాలక్రమేనా ప్రాజెక్టు వద్ద బోటు షికారు సైతం కనుమరుగైంది. దీంతో పర్యాటకులు సాగర్‌ అందాలను ఆస్వాదించ లేకపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ప్రాజెక్టు వద్ద చారిత్రక కట్టడాలను వినియోగంలోకి తీసుకువచ్చి, సందర్శకులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద పర్యాటక ప్రాంతాలను పట్టించుకోని అధికారులు

అధ్వానంగా మారుతున్న కట్టడాలు

సాగర్‌ అందాలు ఇక కనుమరుగేనా? 1
1/3

సాగర్‌ అందాలు ఇక కనుమరుగేనా?

సాగర్‌ అందాలు ఇక కనుమరుగేనా? 2
2/3

సాగర్‌ అందాలు ఇక కనుమరుగేనా?

సాగర్‌ అందాలు ఇక కనుమరుగేనా? 3
3/3

సాగర్‌ అందాలు ఇక కనుమరుగేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement