
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి టౌన్: సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కళాబృందం ప్రతినిధి ప్రభాకర్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సెట్విన్ వృత్తి విద్యా కోర్సు విద్యార్థులకు షీ టీం, పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఆన్లైన్ బెట్టింగ్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు సంప్రదించాలన్నారు. విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైతే షీ టీంను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో షీ టీం, భరోసా సిబ్బంది, కళాబృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో 100 డయల్ చేయాలి
బాన్సువాడ : అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులు 100 డయల్ చేయాలని షీటీం సభ్యులు అనిల్, ప్రియాంకలు సూచించారు. మంగళవారం బాన్సువాడ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు షీటీంపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సైబర్ నేరాలపై, టీ–సేఫ్ యాప్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోకిరిలబెడదఉన్నప్పుడువెంటనే 8712686094కు సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
తాడ్వాయిలో..
తాడ్వాయి(ఎల్లారెడ్డి) : గ్రామాలలో తరచుగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సంతోష్ కుమార్ అన్నారు.మండల కేంద్రంలో మంగళవారం పోలీసుల కళాబృందం ఆధ్వర్యంలో సైబర్ నేరాలతో పాటు పలుఅంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్రవాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలను నడుపొద్దని, జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోఎస్ఐ రాజయ్య,కళాబృందం ప్రతినిధులు ప్రభాకర్, పోలీసు సిబ్బంది, కళాకారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి