ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

May 6 2025 12:50 AM | Updated on May 6 2025 12:50 AM

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 96 వినతులు వచ్చాయి. వాటిలో ఎక్కువగా భూ సమస్యలు, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, రైతు భరోసా, పింఛన్లు మంజూరు తదితర అంశాలపై ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచరాదన్నారు. వెంటనే పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. సాధ్యాసాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీసుకున్న చర్యలపై దరఖాస్తు దారునికి సమాచారం అందించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చందర్‌, ఆర్డీవో వీణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

ప్రజావాణికి 96 వినతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement