పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్‌ సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్‌ సీజ్‌

Oct 27 2025 8:26 AM | Updated on Oct 27 2025 8:26 AM

పశువులను అక్రమంగా తరలిస్తున్న  వ్యాన్‌ సీజ్‌

పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్‌ సీజ్‌

రాయవరం: పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్‌ను పోలీసులు స్వాదీనం చేసుకుని, పశువులను రక్షించిన ఘటన రాయవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబు ఆదివారం విలేకరులకు తెలిపారు. జగ్గంపేట సంతలో పశువులను కొనుగోలు చేసి, అక్కడి నుంచి రామచంద్రపురం వరకు, అక్కడి నుంచి నెల్లూరుకు ఓ వ్యాన్‌పై తరలిస్తున్నారు. కొత్తూరుకు చెందిన సంసేన్‌ను, తమిళనాడు జిల్లా తిరువళ్లూరు ప్రాంతానికి చెందిన వ్యాన్‌ డ్రైవర్‌ వెట్రివేల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 16 ఎద్దులు, 14 చిన్న దూడలను సంరక్షించి, సామర్లకోట గోశాలకు తరలించారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అలాగే వ్యాన్‌ను సీజ్‌ చేసినట్టు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement