వచ్చే నెల 4న జేఎన్‌టీయూకే స్నాతకోత్సవం | - | Sakshi
Sakshi News home page

వచ్చే నెల 4న జేఎన్‌టీయూకే స్నాతకోత్సవం

Jun 28 2025 7:47 AM | Updated on Jun 28 2025 7:47 AM

వచ్చే నెల 4న జేఎన్‌టీయూకే స్నాతకోత్సవం

వచ్చే నెల 4న జేఎన్‌టీయూకే స్నాతకోత్సవం

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూ–కాకినాడ 11వ స్నాతకోత్సవం వచ్చే నెల ఇన నిర్వహిస్తున్నట్లు వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ శుక్రవారం తెలిపారు. ముఖ్య అతిథిగా వర్సిటీ చాన్సలర్‌ హోదాలో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరవుతారని, ముఖ్య అతిథి బోస్టన్‌ గ్రూప్‌ చైర్మన్‌ కోట సుబ్రమ్మణ్యానికి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేస్తామని వివరించారు. స్నాతకోత్సవంలో భాగంగా 2023–24కు సంబంధించి బీటెక్‌ 41,258, బీ–ఫార్మసీ 2,081, ఎంటెక్‌ 1,659, ఎంబీఏ 3,797, ఎంసీఏ 1,115, ఫార్మా–డి 274, బీఆర్క్‌ 83, పీహెడ్‌డీ 100, బంగారు పతకాలు 40 ప్రకటించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు మాజీ వీసీలు, ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు.

30న జాబ్‌మేళా

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 30న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి జి.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణ ప్రభాస్‌ పేపర్‌ మార్ట్‌, ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ గ్రూప్‌లలో 135 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయన్నారు. పదో తరగతి లేదా ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు హాజరు కావచ్చన్నారు. వివరాలకు 86398 46568 నంబరులో సంప్రదించాలని సూచించారు.

ఘనంగా చండీహోమం

అన్నవరం: రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు హోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. అమ్మవార్లకు వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. వేద పండితుడు ఉపాధ్యాయుల రమేష్‌, వనదుర్గ ఆలయ అర్చకుడు కోట వంశీ, పరిచారకులు బాలు, వేణు, వ్రత పురోహితులు దేవులపల్లి ప్రకాష్‌, కూచుమంచి ప్రసాద్‌ తదితరులు హోమం నిర్వహించారు. ఈ హోమంలో 20 మంది భక్తులు రూ.750 టికెట్టుతో పాల్గొన్నారు. కాగా, సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, రత్నగిరి దిగువన తొలి పావంచా వద్ద కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారికి అర్చకుడు చిట్టెం హరగోపాల్‌ ఆధ్వర్యాన పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు.

గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకానికి

4న ఇంటర్వ్యూలు

కాకినాడ సిటీ: స్థానిక జగన్నాథపురంలోని అన్నవరం సత్యవతీదేవీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకాలకు వ చ్చే నెల 4వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంట ర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ వి.అనంతలక్ష్మి తెలిపారు. కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ అ ప్లికేషన్స్‌, కామర్స్‌, బోటనీ, జువాలజీ, ఆక్వా కల్చర్‌, మైక్రో బయాలజీ, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, సంస్కృతం, లైబ్రరీ సైన్స్‌ సబ్జెక్టులు బోధించడానికి అతిథి అధ్యాపకులను నియమిస్తున్నామని వి వరించారు. కనీసం 55 శాతం మార్కులతో పో స్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు అర్హులన్నా రు. నెట్‌, పీహెచ్‌డీ పూర్తి చేసి, డిగ్రీ కళాశాలలో తత్సంబంధిత సబ్జెక్టులో బోధనానుభవం కలిగిన మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.

ఎస్‌కేవీటీ కళాశాలలో..

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): స్థానిక ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్‌ బీవీ తిరుపాణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ బయోడేటాను వచ్చే నెల 3వ తేదీలోగా అందజేయ్యాలన్నారు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులకు జూలై 4వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement