
కూటమి బాండ్లను ప్రజలకు చూపిస్తాం
కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది. హామీల గురించి అడిగితే తాట తీస్తామంటున్నారు. చంద్రబాబు హామీలపై ప్రశ్నించే బాధ్యతను 40 శాతం ఓటుతో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ తీసుకుంది. నాలుక మందంతో కార్యక్రమాలు చేస్తే ప్రజల తరఫున ఉద్యమిస్తాం. చంద్రబాబు, పవన్ మేనిఫెస్టో, బాండ్లను ప్రజలకు చూపిస్తాం. అధికారంలోకి వచ్చి ఏడాదైంది.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏం చేశారని అడుగుదాం. టక్కుటమార విద్యలతో ప్రజల్ని మోసం చేస్తే కుదరదు. తాట తీస్తాం.. తోకలు కట్ చేస్తాం అంటున్నారు. మీ పార్టీలో ఉన్న వాళ్లకు తోకలున్నాయేమో.. మాకు లేవు. అక్రమ కేసులు పెట్టి, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే వైఎస్సార్ సీపీ పనైపోతుందని కూటమి ప్రభుత్వం అనుకుంటోంది. ఇది ప్రజాస్వామ్యమని గుర్తుపెట్టుకోండి.
– బొత్స సత్యనారాయణ, శాసన మండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి
జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్
అందమైన అబద్ధాలే..
బాబు హామీలు
వైఎస్ జగన్ను ఓడించడం తన వల్ల కాదని చంద్రబాబు కూటమి కట్టారు. అందమైన అబద్ధాలను హామీలుగా ఇ చ్చారు. ఎన్నికల్లో ఆయన అబద్ధమే గెలిచింది. ప్రజలు, ప్రతిపక్షం నోరెత్తకుండా బెదిరింపు ధోరణితో కూటమి ప్రభుత్వం పాలన చేస్తోంది. అందుకే ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ పేరుతో వైఎస్సార్ సీపీ ప్రజల్లోకి వెళ్తోంది. క్యూఆర్ కోడ్ను ఫోన్లో స్కాన్ చేస్తే టీడీపీ ప్రజాగళం పేరుతో మేనిఫెస్టో వస్తుంది. సూపర్ సిక్స్ ఉమ్మడి మేనిఫెస్టో వస్తుంది. తొలిసారిగా రైతులకు పెట్టుబడి సాయం అందించిన నేత వైఎస్ జగన్. దీనిని చంద్రబాబు కాపీ కొట్టారు. షణ్ముఖ వ్యూహం పేరుతో పవన్ కల్యాణ్, కూటమి నేతలు మరికొన్ని హామీలిచ్చారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, బీసీలకు పెన్షన్ ఇస్తానంటూ నోటికొచ్చిన హామీలు చంద్రబాబు ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలే అమలు చేయడం లేదు. వివక్ష, వేధింపులే ఏకై క అజెండాగా కూటమి పాలన సాగుతోంది.
– కురసాల కన్నబాబు, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి

కూటమి బాండ్లను ప్రజలకు చూపిస్తాం