
జిల్లాను సారా రహితం చేయాలి
కాకినాడ సిటీ: జిల్లాను సారా రహితంగా తీర్చిదిద్దేందుకు నవోదయం 2.0 కార్యక్రమ నిర్వహణకు అధికారులు కృషి చేయాలని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ రాష్ట్ర కమిషనర్ నిశాంత్ కుమార్, డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ ఆదేశించారు. ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సారా నిర్మూలనకు అధికారులు, సిబ్బంది ఇప్పటి వరకూ చేసిన కృషిపై సమీక్షించారు. సారా ముద్దాయిలను బైండోవర్ చేయాలని, సారా తయారీకి బెల్లం సరఫరా చేసే వ్యాపారులపై గట్టి నిఘా ఉంచాలని, వారిని కూడా బైండోవర్ చేయాలని ఆదేశించారు. సారా నిర్మూలనపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. పలు కేసులలో ముద్దాయిల ప్రవర్తన పరిశీలించి, ఇంకా సారా వ్యాపారం చేస్తూంటే పీడీ యాక్ట్ పెట్టాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళి, అసిస్టెంట్ కమిషనర్ వి.రేణుక, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి ఎం.కృష్ణకుమారి, ఏఈఎస్ కె.మౌనిక, జిల్లాలోని ఎకై ్సజ్ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.