
ఇంటర్నేషనల్ రోబోటిక్స్ పోటీల్లో ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రోబోరోర్ మలేషియా–25 వెఫా రోబోటిక్ నిర్వహించిన ఇంటర్నేషనల్ రోబోటిక్స్ పోటీల్లో కాకినాడ లక్ష్య స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. స్మోర్పీ ఇమాజినరీలో ప్రథమ, తృతీయ స్థానాలు, స్మోర్పీ పైలట్ విభాగంలో రెండు రజత పతకాలు, కాంస్య పతకం సాధించారు. స్మోర్పీ స్క్వేర్ అటానమస్ విభాగంలో రెండు స్వర్ణం, రజక పతకం సాధించి ఓవరాల్ చాంపియన్షిప్ కై వసం చేసుకున్నారు. టీమ్ వన్లో రిహాన్సనా, లలిత్ కుమార్వర్మ, సాజిత్, ఆదిత్య ఆనంద్, ఎ.వీనిత్లు పాల్గొనగా టీమ్–2లో డి.మనోహర్రెడ్డి, దుర్గాఆదిత్య శశాంక్, ముకుంద, నాగసాయి అభినవ్, ఎన్.అర్జున్ పాల్గొన్నారు. స్కూల్ డైరెక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు రోబోటిక్స్ ఒక ప్రత్యేక సబ్జెక్టుగా నేర్పిస్తున్నామన్నారు. ఆదిత్య విద్యాసంస్థల అధినేత శేషారెడ్డి మాట్లాడుతూ పలు దేశాలు పాల్గొన్న పోటీల్లో ఇండియా నుంచి తమ స్కూల్ విద్యార్థులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల బృందాన్ని ప్రిన్సిపాల్ వందనబోహ్రా, ఉపాధ్యాయులు అభినందించారు.