గుట్టుగా దోపిడీ! | - | Sakshi
Sakshi News home page

గుట్టుగా దోపిడీ!

Jun 26 2025 6:51 AM | Updated on Jun 26 2025 6:51 AM

గుట్ట

గుట్టుగా దోపిడీ!

పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్వతహాగా సినీ నటుడు కావడంతో ఆయన ఇలాకాలో అభివృద్ధ్ది పేరుతో చేస్తున్న పనులు సినిమా యాక్షన్‌ను తలపిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. క్లాప్‌.. స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌.. అన్నట్టుగా గట్టుపై ఒక జేసీబీ పెడుతున్నారు.. కొందరు నేతలు వస్తారు.. కొబ్బరి కాయలు కొడతారు.. వారు వెళ్లి పోగానే జేసీబీతో అక్కడ మట్టి ఇక్కడ వేసి జేసీబీని తరలించేస్తారు. ఈ యాక్షన్‌ సన్నివేశం ఖరీదు రూ.లక్షల్లో ఉంటుంది. క్లోజర్‌ పనుల్లో కూటమి నేతలు దోపిడీకి దారి వేసుకున్నారు. రూ.వేలల్లో పని చేసి రూ.లక్షల్లో దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి నేతల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లోజర్‌ పనుల్లో నాణ్యతకు గోతులు తవ్వి దోపిడీకి గుట్టుగా దారి చేసుకుంటున్నారు అంటూ రైతులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది ఏలేరుకు వచ్చిన వరదల్లో ఏలేరు కాలువకు గండ్లు పడి పిఠాపురం నియోజకవర్గంలో వేలాది ఎకరాల పంట నీట మునిగి రైతులు రూ.కోట్లలో నష్టపోయారు. పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో కొందరు రైతులు పంట వేసే పరిస్థితి లేకుండా పోయింది. వీటికి నష్టపరిహారాలు ఇవ్వడంలోనూ కూటమి ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపించిందని రైతులు వాపోతున్నారు. ఏలేరు సుద్దగడ్డ ఆధునీకరించి చూపిస్తానంటూ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చేసిన వాగ్దానాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఇప్పటికే ఏలేరు కాలువ గట్లు బలహీనంగా మారి గట్టిగా వరదొస్తే వెంటనే గండ్లు పడే పరిస్థితి ఏర్పడింది. ఉన్న గండ్లను పూడ్చడంలో నాణ్యత లోపాలు ఉండడంతో ఏ మాత్రం వరద వచ్చినా మొత్తం పంటలన్నీ నష్టపోయే అవకాశం ఉంది. వేలాది ఎకరాల ఆయకట్టుకు ఏలేరు కాలువ పటిష్టత ఆయువుపట్టు వంటిది. అటువంటి ఏలేరు కాలువలో గండ్లు పూడ్చివేత పనులు నాణ్యతా ప్రమాణాలతో చేయకపోవడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గండ్లు పూడ్చివేతకు రూ.కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ పక్కనే ఉన్న మట్టిని తీసి గట్లు వేసి ఽతూతూ మంత్రంగా గండ్లు పూడ్చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి తీసి గట్టుపై వేసి సరిపెట్టేస్తే మళ్లీ వరదొస్తే మా పరిస్థితి ఏంటి అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. పక్కనున్న మట్టి వేయడానికే రూ.లక్షలు వ్యయం అవుతుందా అంటు రైతులు కూటమి నేతల దోపిడీని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. రూ.30 లక్షల విలువైన పనిని కేవలం 30 గంటల్లో పూర్తి చేసేశారంటే కూటమి నేతల అవినీతి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందంటున్నారు రైతులు.

పొలంలో మట్టి కొల్లగొట్టి

పిఠాపురం మండలం రాపర్తి వద్ద గొర్రిఖండి కాలువకు గండ్లు పడి గత ఏడాది పంటలు కొట్టుకుపోయాయి. ఆ గండ్ల పూడ్చివేతకు తాత్కాలిక పనులు చేపట్టారు. ముక్కొల్లు నీటి సంఘం ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ అధికారులు 34 గండ్లు పూడుస్తున్నారు. పిఠాపురం మండలం రాపర్తి పరిధిలో వర్కు నంబరు 28 నుంచి 34 వరకు పనులు చేపట్టారు. వీటి నిర్మాణానికి రూ.30.32 లక్షలు కేటాయించారు. వీటిలో కొన్ని టీడీపీ, కొన్ని జనసేన నేతలకు కేటాయించినట్లు తెలిసింది. ప్రతి గండి పూడ్చివేతకు ఇతర ప్రాంతాల నుంచి మట్టిని తరలించి తీసుకువచ్చి పూడ్చుతున్నట్లుగా ఎస్టిమేట్లలో చూపించిన అధికారులు కాలువ పక్కనే ఉన్న భూముల్లో మట్టిని అక్కడికక్కడే తవ్వి గట్టుపై వేసేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో గట్టు పటిష్టత దెబ్బతిని మళ్లీ వరద వస్తే గండ్లు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం

తూతూమంత్రంగా గండ్లు పూడ్చివేత పనులు చేయడం వల్ల మళ్లీ వరద వస్తే క్షణాల్లో గట్లు తెగి వరద నీరు పంట పొలాలను ముంచెత్తే ప్రమాదం కనిపిస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గట్లు ౖపైపెన కొంత మేర మామూలు మట్టిని సర్దేయడం వల్ల పెను ముప్పు తప్పదని వారు అంటున్నారు.

అక్కడి మట్టితోనే గండికి పూత!

రాపర్తి వద్ద ఏలేరు కాలువ 10.100 కిలో మీటరు వద్ద గొర్రిఖండి కాలువకు పడిన గండి పూడ్చివేతకు వర్కు 34కి రూ.4.82 లక్షలు కేటాయించారు. దీని కోసం ఇతర ప్రాంతాల నుంచి మెటీరియల్‌ తీసుకు రావడం వల్ల ఇంత ఖర్చు అవుతున్నట్లు చూపించినట్లు తెలిసింది. కానీ నిబంధనలకు విరుద్ధంగా గట్టు పక్కనే ఉన్న రైతుల భూముల్లోని మట్టిని తవ్వి, కాలువలో ఉన్న ఇసుక బస్తాల్లో వేసి వాటిని పేర్చి మట్టి వేసి గట్టును తయారుచేసినట్టు చూపి చేతులు దులిపేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ గతంలో పడిన గండిని గతంలోనే తాత్కాలికంగా కొంతమేర మూసేశారు. దానిపైనే మట్టి వేసి మొత్తం గట్టు అంతా పూడ్చినట్టుగా బిల్లులు పెట్టుకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. సుమారు 10 మీటర్ల మేర ఉన్న ఈ గండికి పక్కనే ఉన్న మట్టిని వేయడం వల్ల కేవలం రూ.70 వేలకు మించి ఖర్చు కాదని చెబుతున్నారు. కానీ దీనికి ఏకంగా రూ 4.82 లక్షలు వ్యయం అయినట్లు చూపించి సుమారు రూ.4 లక్షలు దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీనికి పక్కనే ఏలేరు కాలువ 10.200 కిలో మీటరు వద్ద గొర్రిఖండి కాలువకు పడిన గండి పూడ్చివేతకు వర్కు నంబరు 33కి రూ.5.63 లక్షలు కేటాయించారు. పక్కనే ఉన్న రైతుల భూముల్లోని మట్టిని తవ్వి ఇసుక బస్తాలు పేర్చి మట్టి వేసి గట్టు వేసేసినట్టు చూపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పనికి సైతం కేవలం రూ.70 వేలకు మించి ఖర్చు కాదని, కానీ ఏకంగా రూ 5.63 లక్షలు వ్యయమైనట్టు బిల్లులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈవిషయంపై ఏలేరు నీటిపారుదల శాఖ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు.

గొర్రి‘గండి‘ పనుల్లో అవినీతి జలగలు

పక్క పొలంలో మట్టితో గండ్ల పూడ్చివేత

రూ.వేలల్లో ఖర్చు.. రూ.లక్షలు మేత

క్లోజర్‌ మొత్తం పనుల్లో కూటమిగా

రూ.కోట్లు స్వాహా

గుట్టుగా దోపిడీ!1
1/4

గుట్టుగా దోపిడీ!

గుట్టుగా దోపిడీ!2
2/4

గుట్టుగా దోపిడీ!

గుట్టుగా దోపిడీ!3
3/4

గుట్టుగా దోపిడీ!

గుట్టుగా దోపిడీ!4
4/4

గుట్టుగా దోపిడీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement