
ఏడీబీ రోడ్డుపై లారీ దగ్ధం
రంగంపేట: స్థానిక శివారు ఏడీబీ రోడ్డుపై బుధవారం కాంక్రీట్ మిల్లర్ లారీ దగ్ధమైంది. ఏడీబీ రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా కాంక్రీట్ తీసుకువచ్చిన లారీ అన్లోడింగ్ అనంతరం డ్రైవర్ లారీని రోడ్డుపై పార్కు చేసి పక్కకు వెళ్లారు. అనంతరం లారీపై ఉన్న విద్యుత్తు తీగలు గాలికి కదిలి తాకడంతో ఒక్కసారిగా లారీ టైర్ల నుంచి మంటలు వచ్చి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో లారీలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.