‘సాక్షి’పై దాడులు ఆపాలి | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి’పై దాడులు ఆపాలి

Jun 10 2025 6:59 AM | Updated on Jun 10 2025 8:02 AM

‘సాక్

‘సాక్షి’పై దాడులు ఆపాలి

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాక్షి కార్యాలయాలపై అధికార పార్టీ కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ సభ్యుడు కె.స్వాతిప్రసాద్‌ సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. సాక్షి కార్యాలయాలపై దాడులు చేసి బోర్డులపై సాక్షి అక్షరాలను తొలగించడం, పత్రిక ప్రతులను దహనం చేయడం వంటి చర్యలకు పాల్పడటం దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు. 

ఈ నెల 6న ‘సాక్షి’ టీవీలో ప్రసారమైన లైవ్‌ షోలో అమరావతి మహిళలను కించపరుస్తూ ఒక పాత్రికేయుడు చేసిన వ్యాఖ్యలు దారుణమని, దీనిపై పలుచోట్ల పౌరులు ఫిర్యాదులు చేయగా కేసులు నమోదయ్యాయని, వాటిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కార్యకర్తలు సాక్షి కార్యాలయాలపై దాడులకు పూనుకోవడం గర్హనీయమన్నారు. 

పత్రికా కార్యాలయాలపై దాడులు చేసే సంస్కృతి పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ నేతలు వెంటనే తమ కార్యకర్తలను అదుపు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే లైవ్‌ షో నిర్వాహకుడు, సీనియర్‌ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు తన షోలో జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్పినందున, ఆయన సీనియార్టీ, వయస్సును దృష్టిలో ఉంచుకుని ఆయనపై తదుపరి చర్యలు నిలిపివేయాలని స్వాతిప్రసాద్‌ కోరారు.

‘సాక్షి’పై దాడులు ఆపాలి

‘సాక్షి’పై దాడులను నిరసిస్తూ రాజానగరంలోని పత్రిక యూనిట్‌ కార్యాలయం వద్ద సిబ్బంది సోమవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని, పత్రికా కార్యాలయాలపై దాడులు వెంటనే ఆపాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బ్రాంచి మేనేజర్‌, రీజినల్‌ మేనేజర్‌ రమేష్‌రెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. కాగా,

సాక్షిపై దాడులు అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని పలు మండలాల్లో పాత్రికేయులు పోలీసు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.

 

‘సాక్షి’పై దాడులు ఆపాలి1
1/1

‘సాక్షి’పై దాడులు ఆపాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement