వేసవికాలం పూర్తయ్యే వరకు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది, ఇతర అధికారులు ఏ ఒక్కరూ అత్యవసరం అయితే తప్ప సెలవు తీసుకోకుండా 80 శాతం మంది సిబ్బందితో పనిచేస్తాం. ప్రతి కేంద్రానికి బోరు ఉంది. జిల్లాలో నీటి వసతి బాగా ఉండటం వల్ల నీటికి ఇబ్బంది లేదు. జాతీయ రహదారి, పరిశ్రమలు, ఇతర ప్రమాదకరమైన వాటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడం జరుగుతుంది. ఎక్కడ ప్రమాదం జరిగినా వెంటనే చేరుకోవడానికి కృషిచేస్తాం. ప్రజలు ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా వెంటనే 101, 112కు సమాచారం ఇవ్వాలి. – కిషోర్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, మహబూబ్నగర్
●


