గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న వ్యవసాధికారులు
● ఇప్పటికి 40 శాతం పూర్తి
● పంటల దిగుబడిపై అంచనా
● సర్వేతో వ్యవసాయ
పురోగతికి దోహదం
గద్వాల వ్యవసాయం: గడిచిన ఇరవై రోజుల నుంచి జిల్లాలో పంటల నమోదు (డిజిటల్ క్రాప్ సర్వే.. బుకింగ్) పకడ్బందీగా సాగుతోంది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ఎన్ని ఎకరాల్లో ఏ రకమైన పంటలు సాగు చేశారు.. దిగుబడిపై అంచనా వస్తుందని వ్యవసాయాధికారులు అంటున్నారు. ఈ వివరాలతో మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఆహర ధాన్యాల లభ్యతపై ప్రభుత్వానికి స్పష్టత రానుంది.
గద్వాల వ్యవసాయ ఆధారిత జిల్లా. జూరాల, ఆర్డీ ఎ స్ ప్రాజెక్ట్లతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల.. దాని కింద ఆరు రిజర్వాయర్లు ఉన్నాయి. దీంతో పాటు బోర్లు, బావుల కింద పంటల సాగు జరుగుతోంది. సుమారుగా ఏటా వానాకాలం సీజన్లో 3.80 లక్ష లు, యాసంగిలో 1.30లక్షల ఎకరాల్లో పంట లు సా గు చేస్తున్నారు. పత్తి, సీడ్పత్తి, వరి, కంది, మిరప, వేరుశనగ పంటలతో పాటు ఉద్యాన, వాణిజ్య పంటల సాగుపై స్థానిక రైతులు ఆసక్తి చూపుతున్నారు.
మండలాల వారీగా..
మండలం ఎకరాలు
అలంపూర్ 8,478
ధరూరు 36,850
అయిజ 47,895
ఇటిక్యాల 20,549
కేటీదొడ్డి 29,416
మానవపాడు 20,568
మల్దకల్ 34,269
రాజోళి 19,412
ఉండవల్లి 18,303
వడ్డేపల్లి 21,782
ఎర్రవల్లి 25,251


