నిబంధనలు తుంగలో తొక్కి.. | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు తుంగలో తొక్కి..

Jun 28 2025 5:49 AM | Updated on Jun 28 2025 8:19 AM

 నిబంధనలు తుంగలో తొక్కి..

నిబంధనలు తుంగలో తొక్కి..

వాస్తవానికి ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సాగైన ధాన్యం దిగుబడులను దృష్టిలో ఉంచుకుని రైస్‌మిల్లుల సామర్థ్యం కంటే రెండింతలు ధాన్యం కేటాయించాలని సివిల్‌సప్లయ్‌ శాఖనుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనినే సాకుగా చేసుకున్న సదరు అధికారి తనకు రేటు కట్టిన అయిజ, కేటీ దొడ్డి మండలాల్లోని రెండు మిల్లులకు నిబంధనలను తొక్కేసి అధికంగా ధాన్యం కేటాయింపులు చేశారు. అయిజలోని ఓ రైస్‌మిల్లు రెండు టన్నుల కెపాసిటీ ఉండగా దానిని 6 టన్నుల కెపాసిటీకి పెంచి 3 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం బస్తాలు కేటాయించాడు. రూ.3 లక్షలు రేటు కట్టి వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కేటీదొడ్డి మండలంలోని ఓ నాయకుడి మిల్లుకు 6 టన్నుల కెపాసిటీ నుంచి 10 టన్నుల కెపాసిటీకి పెంచి 6 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం బస్తాలు కేటాయించాడు. ఇక్కడ కూడా రూ.4 లక్షల రేటు కట్టి వసూళ్లు చేసినట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement