
గతంలో రూ.100 కోట్ల ధాన్యం మాయం
గతంలో జిల్లాలో సుమారు రూ.100 కోట్ల విలువైన ధాన్యాన్ని కొందరు రైస్మిల్లర్లు మాయం చేసి ప్రభుత్వానికి టోకరా వేసిన ఘటన సంచలనం రేపగా.. దీనిపై రికవరీ చేయాల్సిన అధికారులు నోటీసులతో సరిపెడుతున్నారు. ఇప్పుడు కూడా అధికారుల ఉదాసీనత వ్యవహారంతో మరోసారి అదే తరహాలో మోసం జరిగే అవకాశాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు మేలుకుని చర్యలు తీసుకుని సదరు ఽఅధికారిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది.
విచారించి చర్యలు చేపడతాం
సివిల్సప్లయ్ శాఖ నుంచి అన్ని రైస్మిల్లులకు ఉన్న సామర్థ్యానికి రెండింతలు ధాన్యం కేటాయించాలని ఉత్తర్వులు వచ్చాయి. ఆ మేరకు రైస్మిల్లులకు ధాన్యం కేటాయించడం జరిగింది. ఆరోపణలు వస్తున్న ఆ రెండు రైస్మిల్లులో క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటాం. అధికారి వ్యవహార శైలిపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్