స్నాతకోత్సవానికి వేళాయె | - | Sakshi
Sakshi News home page

స్నాతకోత్సవానికి వేళాయె

Jun 28 2025 5:49 AM | Updated on Jun 28 2025 8:19 AM

స్నాత

స్నాతకోత్సవానికి వేళాయె

ఘనంగా నిర్వహిస్తాం..

పీయూ 4వ కాన్వకేషన్‌ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో నిర్వహించేందుకు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నాం. కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మకు ఆహ్వానం అందించారు. ముఖ్యంగా గోల్డ్‌మెడల్స్‌ ఇచ్చేందుకు స్పాన్సర్లు ముందుకు వస్తే వారి పేరు మీద కూడా అందిస్తాం. ఇందు కోసం రూ.2 లక్షలు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. – శ్రీనివాస్‌, పీయూ వీసీ

పీయూలో 4వ కాన్వకేషన్‌కు

సిద్ధమవుతున్న అధికారులు

హాజరుకావాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మకు ఆహ్వానం

యూజీ, పీజీ, పీహెచ్‌డీ, ఫార్మలో మొత్తం 88 మందికి గోల్డ్‌మెడల్స్‌

రూ.2 లక్షలు స్పాన్సర్‌ చేస్తే వారి పేరు మీద విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్‌ ఇచ్చే అవకాశం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 2023– 25 విద్యా సంవత్సరం వరకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఫార్మ వంటి కోర్సులు చదువుతూ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్‌ ప్రదానం చేసే స్నాతకోత్సవానికి యూనివర్సిటీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల జాబితాను సిద్ధం చేశారు. మొత్తం 88 మంది విద్యార్థులకు మెడల్స్‌ అందజేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వీరితో పాటు కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సైతం కాన్వకేషన్‌ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు విద్యార్థుల నుంచి దరఖాస్తులు సైతం స్వీకరించారు. గతేడాది చివరలో కూడా కాన్వకేషన్‌ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేసినప్పటికీ కొన్ని కారణాలతో ఆగిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు పీయూ వీసీ శ్రీనివాస్‌, రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు గవర్నర్‌కు ఆహ్వానం అందించారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో గవర్నర్‌ ఇచ్చే తేదీల ఆధారంగా కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది.

స్పాన్సర్లకు అవకాశం..

కాన్వకేషన్‌లో మెడల్స్‌ ఇచ్చేందుకు అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అయితే ఆసక్తి గలవారు స్పాన్సర్‌షిప్‌ చేస్తే వారి పేరు మీద కూడా మెడల్స్‌ ప్రదానం చేయనున్నారు. ఇందుకోసం వ్యక్తులు యూనివర్సిటీ పేరు మీద రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే కేవలం ఆ డబ్బుల మీద వచ్చే వడ్డీతో మాత్రమే మెడల్స్‌ను విద్యార్థులకు అందజేస్తారు. అందుకోసం ఆసక్తి గలవారు నేరుగా యూనివర్సిటీ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.

88 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్‌

పీయూ పరిధిలో 2022–23, 2023–24, 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ టాపర్‌లుగా నిలిచిన విద్యార్థులకు త్వరలో నిర్వహించే 4వ స్నాతకోత్సవ కార్యక్రమంలో గోల్డ్‌మెడల్స్‌ అందించనున్నట్లు పీయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రవీణ పేర్కొన్నారు. ఇందులో ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌, సోషల్‌ సైన్స్‌, కామర్స్‌లో 21 మంది విద్యార్థులు, ఫ్యాకల్టీ ఆఫ్‌ సైన్స్‌లో 27 మంది, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీలో 14 మంది, ఫ్యాకల్టీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో 9, యూజీ కోర్సులలో టాపర్స్‌లో 17 మంది గోల్డ్‌మెడల్స్‌ అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గోల్డ్‌మెడల్స్‌ సాధించిన విద్యార్థుల జాబితాను సంబంధిత కళాశాలలకు పంపించామని, వాటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నాలుగు రోజుల్లో తెలపవచ్చని పేర్కొన్నారు.

–ప్రవీణ, పీయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌

మూడు గోల్డ్‌ మెడల్స్‌ చొప్పున

మొత్తం 2023, 2024, 2025 విద్యా సంవత్సరాలకు సంబంధించి మొత్తం 13 పీజీ కోర్సులు, ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ, బీ, ఎం ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్‌ ఫార్మ, బీపెడ్‌, ఎంపెడ్‌, ఎంబీఏ, బీఈడీ వంటి కోర్సులు ఉండగా.. వీటితో పాటు డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ వంటి కోర్సులు ఉన్నాయి. వీటిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్‌ అందజేయనున్నారు. వీటితోపాటు పీయూలో ఇటీవల పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా గోల్డ్‌ మెడల్స్‌ ఇవ్వనున్నారు.

స్నాతకోత్సవానికి వేళాయె 1
1/3

స్నాతకోత్సవానికి వేళాయె

స్నాతకోత్సవానికి వేళాయె 2
2/3

స్నాతకోత్సవానికి వేళాయె

స్నాతకోత్సవానికి వేళాయె 3
3/3

స్నాతకోత్సవానికి వేళాయె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement