విత్తన దుకాణాల్లో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

విత్తన దుకాణాల్లో తనిఖీలు

Jun 10 2025 3:42 AM | Updated on Jun 10 2025 3:42 AM

విత్త

విత్తన దుకాణాల్లో తనిఖీలు

అయిజ: మండల కేంద్రంలోని విత్తన దుకాణాల్లో సోమవారం విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, వ్యవసాయ అధికారులు తనిఖీ చేశారు. ఇందులో భాగంగా సాయిరాం హైబ్రీడ్‌ సీడ్స్‌, శింతి సీడ్స్‌, సాయిరాం సీడ్స్‌ దుకాణాల్లో స్టాక్‌ రిజిస్టర్‌, నిలువలు, బిల్లు బుక్కులు, ఇన్వాయిసులు, సోర్స్‌ సర్టిఫికెట్లు పరిశీలించారు. నిబంధనల మేరకు విత్తనాలు విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జనార్ధన్‌, విజిలెన్స్‌ అధికారులు సీఐ గణేష్‌, ఏసీటీఓ సురేష్‌. ఎస్సై శ్రీరాము పాల్గొన్నారు.

బీచుపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు

ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు బీచుపల్లికి చేరుకొని శివుడిని దర్శించుకున్నారు. ధ్వజస్తంభం ఎదుట కొబ్బరికాయలు కొట్టి శివుడికి పంచామృత అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి

గద్వాల: పేదల సంక్షేమానికి ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. సోమవారం గద్వాల పట్టణంలోని రాజవీదిలో పట్టణ అధ్యక్షురాలు రజకశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై రేషన్‌ బియ్యం పంపిణీ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో పేదలకు ఒకేసారి మూడు నెలల రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రవి, ఎక్బోటా, వెంకటరాములు తదితరులు ఉన్నారు.

‘గట్టు’లో ముగిసిన ధాన్యం కొనుగోళ్లు

గట్టు: యాసంగి సిజన్‌లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌ తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా గట్టు,మాచర్ల, ఆలూరు, పెంచికలపాడు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం 1,13,617 సంచుల ద్వారా 52.617 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెంకటేశ్‌ తెలిపారు. గట్టు కొనుగోలు కేంద్రం ద్వారా 369 మంది రైతులకు సంబందించి 49,739 బస్తాలు, మాచర్లలో 320 మంది నుంచి 39,503 బస్తాలు, ఆలూరులో 164 మంది నుంచి 18,868 బస్తాలు, పెంచికలపాడులో 202 మంది నుంచి 23,507 బస్తాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ఏ–గ్రేడ్‌ రకానికి 2330 మద్దతు ధరను చెల్లించి కొనుగోలు చేసింది. దీనికి అదనంగా క్వింటాల్‌కు ప్రభుత్వం 500 బోనస్‌ను చెల్లించనున్నది. దీంతో రైతులు యాసంగిలో పండించిన వడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు.

విత్తన దుకాణాల్లో  తనిఖీలు 
1
1/3

విత్తన దుకాణాల్లో తనిఖీలు

విత్తన దుకాణాల్లో  తనిఖీలు 
2
2/3

విత్తన దుకాణాల్లో తనిఖీలు

విత్తన దుకాణాల్లో  తనిఖీలు 
3
3/3

విత్తన దుకాణాల్లో తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement