
అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలోని బాలభవనంలో జానపద, భరత నాట్యం, కూచిపూడి శాసీ్త్రయ నృత్యాలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. సోమవారం సాయంత్రం బాలభవన్లో నాట్యమయూరి దివ్య నృత్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరం ముగింపు వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారులలో అంతర్గతంగా దాగిఉన్న ప్రతిభను ప్రోత్సహించాలని, అప్పుడే వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. పాశ్చాత్య సంస్కృతి నుంచి ఉపశమనం పొందేందుకు సాంప్రదాయ కళలు, నృత్యాలు పరిపూర్ణంగా దోహద పడతాయన్నారు. సమాజాన్ని చైతన్య పర్చేలా సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించాలన్నారు. విజయ్, మాదవి, వెంకటేశ్వర్లు, అమరేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ వేణుగోపాల్ పాల్గొన్నారు.