
ఉత్సాహంగానే బడికి
చిన్నప్పుడు పాఠశాలలు పునఃప్రారంభమైన సమయంలో బడికి వెళ్లి స్నేహితులతో ఆడుకోవచ్చని అనుకునే వాడ్ని. కొత్త స్నేహితులు ఎవరెవరూ వస్తారనే ఆసక్తి ఉండేది. ప్రాథమిక విద్య మా స్వగ్రామం బిజ్వారంలో సాగింది. హైస్కూల్ చదువుల కోసం గద్వాలకు వచ్చాం. అప్పుడు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష పెట్టి పాఠశాలలో చేర్పించుకున్నారు. ఏ ఒక్క రోజు కూడా బడికి వెళ్లేందుకు మారం చేయలేదు. అప్పటి గురువుల ప్రోత్సాహం మరువలేనిది. వారి మార్గదర్శనంతోనే నేడు పేద ప్రజలకు వైద్య సేవలు అందించగలుగుతున్నాం.
– డాక్టర్ రఘునాథ్రెడ్డి, గద్వాల