
రైతు ‘భరోసా’ ఏది ?
పెట్టుబడి సాయం కోసం రైతుల ఎదురుచూపులు
●
మానవపాడు: రైతులకు చేయూత ఇచ్చేందుకు గత ప్రభుత్వం రైతుబంధు పథకం అమలుచేసి ఏటా వానాకాలం, యాసంగి పంటల పెట్టుబడి కోసం ఎకరాకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో సాగు సమయంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయి. 2023 డిసెంబర్లో ఏర్పడిన రైతు బంధు పథకం పేరును రైతుభరోసాగా మార్చింది. ఈ పథకంలో ఎకరాకు రూ.7500 ప్రతి పంటకు అందిస్తామని మాట ఇచ్చింది. ఇదిలాఉండగా, ఈ ఏడాది వానాకాలం సీజన్ ముందుగానే ప్రారంభం కావడం, వర్షాలు మే నెలలో విస్తారంగా కురవడంతో రైతుభరోసా సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. గత వార్షకాలం సీజన్ రైతు భరోసా పెట్టుబడి సాయం అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సీజన్లో అయినా సాగుకు ముందుసాయం అందించాలని కోరుతున్నారు. గత 15 రోజులుగా అకాల వర్షాలు, నైరుతి రుతుపవనాల రాకతో జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. దీంతో రైతులు పొలం బాట పట్టారు. గత ఖరీప్, రబీ పంటల మొదళ్లు, వేర్లు తొలగిస్తూ చెత్తాచెదరం కాల్చివేస్తున్నారు. ఇప్పటికే వేసవి దుక్కులు దున్నిన రైతులు దౌర కొడుతూ చేను సారవంతం చేసి విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ వర్షాకాలంలో జిల్లావ్యాప్తంగా వేల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా పత్తి, వరి, మిరప, కందులు, పొగాకు సాగు చేయనున్నారు. యేటా తొలకరి వర్షాలు ఆలస్యంగా కురవడంతో జూన్ నెలాఖరులో పత్తి విత్తనాలు వేయడం, వరి నారు పోయడం చేస్తుంటారు. ఈ సారి ముందుగానే వర్షాలు రావడంతో రైతులు విత్తుకునేందుకు సిద్ధమయ్యారు.
జిల్లా వివరాలిలా..
త్వరగా అందించాలి
గత వానాకాలం ఎవరికి రైతుభరోసా ఇవ్వలేదు. యాసంగిలో ఐదు ఎకరాలలోపు రైతులకు డబ్బులు పడ్డాయి. వర్షాలు ముందు కురుస్తుడటంతో పంట పొలాలను సాగుకు సిద్ధం చేశాం. త్వరగా రైతుల ఖాతాల్లో రైతుభరోసా నగదు జమ చేస్తే ఎంతో మేలు చేసినట్లవుతుంది. – గోపాల్, రైతు, గోకులపాడు
అప్పులు తప్పుతాయి..
ఈ ఏడాది వానాకాలం ముందే వచ్చింది. ప్రతి యేడాది విత్తనాలు నాటేందుకు ఆలస్యమయ్యేది. పత్తి వేసుకునేందుకు దుక్కిదున్ని సిద్ధం చేసుకున్నా. ప్రభుత్వం రైతుభరోసా సాయం అందిస్తే విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు ఇబ్బంది ఉండదు. లేదంటే అప్పులు చేసి మరీ కొనుగోలు చేయాల్సి వస్తుంది.
– శ్రీకాంత్రెడ్డి, రైతు, మానవపాడు
ముందస్తు వర్షాలతో పొలం బాట
దుక్కులు సిద్ధం చేస్తున్న రైతులు
విత్తనాలు, ఎరువులకు ఏర్పాట్లు
జిల్లాలో 1,65,763 మంది రైతులు
విడతల వారీగా...
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం ఎకరానికి రూ.5వేలు చొప్పున అందించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరుతో ఎకరానికి రూ.6వేలు చొప్పున గత యాసంగి నుంచి అందిస్తోంది. జనవరి నుంచి మార్చి వరకు ఎకరాలోపు, ఆ తర్వాత రెండు, మూడు, నాలుగు ఐదు ఎకరాల్లో భూమి ఉన్న రైతుల ఖాతాల్లో విడతల వారీగా నగదు జమ చేసింది. యాసంగి పంటలు దిగుబడి వచ్చే సమయం వరకు నగదు జమ చేస్తూ వచ్చింది. ఈ ఖరీఫ్ సీజన్లోనైనా సాగు సమయానికి నగదు అందితే ఎంతో మేలు చేకూరుతుందని రైతులు బావిస్తున్నారు.

రైతు ‘భరోసా’ ఏది ?

రైతు ‘భరోసా’ ఏది ?

రైతు ‘భరోసా’ ఏది ?

రైతు ‘భరోసా’ ఏది ?