‘ప్రజావాణి’ ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

‘ప్రజావాణి’ ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి

Jun 10 2025 3:42 AM | Updated on Jun 10 2025 3:42 AM

‘ప్రజావాణి’ ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి

‘ప్రజావాణి’ ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి

గద్వాల: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ సమస్యలకు పరిష్కారం కోరుతూ ప్రజలు నేరుగా కలెక్టర్‌కు వినతులు అందించారు. మొత్తం 52 ఫిర్యాదులు రాగా.. ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్‌నాలెడ్డ్‌మెంట్‌ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కలెక్టరేట్‌ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement