మందెయ్‌.. చిందెయ్‌ | - | Sakshi
Sakshi News home page

మందెయ్‌.. చిందెయ్‌

May 4 2025 6:57 AM | Updated on May 4 2025 6:57 AM

మందెయ

మందెయ్‌.. చిందెయ్‌

చీకటి పడితే చాలు రెచ్చిపోతున్న మందుబాబులు

అనధికార సిట్టింగులు.. తరచూ గొడవలు

పట్టణంలోని కొత్తబస్టాండు ప్రాంతంలో వైన్‌షాపుల వద్ద మందుబాబులు లిక్కర్‌ కొనుగోలు చేసి పక్కనే అనధికారికంగా సిట్టింగ్‌ చేస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రధానంగా బస్టాండ్‌ ఉండడం, మెయిన్‌బజార్‌లో అన్ని రకాల వ్యాపార సముదాయాలు ఉండడంతో సామాన్య ప్రజలు వివిధ అవసరాల దృష్ట్యా రాకపోకలు సాగిస్తారు. అయితే మందుతాగిన మందుబాబులు ఫుల్‌గా మందేసి ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తుంటారు. మద్యం మత్తుతలో రోడ్లపై వెళ్లే సామాన్యుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటనలు అనేకం ఉన్నాయి. గత నెల కొత్తబస్టాండు వద్ద బైక్‌పై వెళ్తున్న భార్యభర్తల పట్ల అనుచితంగా వ్యవహరించి వారికి ఇబ్బందులు కలిగించారు. కొందరు సర్దిచెప్పినా వినకపోవడం పోలీసు జోక్యంతో సదరు భార్యభర్తలు మందుబాబుల బారినుంచి బయటపడ్డారు.

● అంబేడ్కర్‌ చౌరస్తాలో ఉన్న ఓ బార్‌ షాపులో మద్యం మత్తులో యువకులు ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వెళ్లి అల్లరి చేశారు. దీనిపై ప్రశ్నించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై అమానుషంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన అప్పట్లో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇవి మచ్చుకు కొన్ని ఘటనలు మాత్రమే. ప్రతిరోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

గద్వాల/గద్వాలక్రైం: జిల్లా కేంద్రంలో మందుబాబుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. సాయంత్రం అయ్యిందంటే చాలు మద్యం తాగి ఆ మత్తులోనే రోడ్లపైకి వచ్చి నానా హంగామా సృష్టిస్తుండడం పరిపాటిగా మారింది. నిబంధనల ప్రకారం వైన్‌షాపు వద్ద ఉన్న పర్మిట్‌ రూంలలోనే మద్యం తాగాల్సి ఉన్నా.. వైన్‌షాపుల ఎదుట రోడ్లపైకి వచ్చి బహిరంగంగా మద్యం తాగుతున్నారు. గద్వాల పట్టణంలో మొత్తం 8 వైన్‌ షాపులు, మూడు బార్‌ షాపులున్నాయి. వీటిల్లో రోజుకు రూ.32లక్షల లిక్కర్‌ తాగేస్తున్నారంటే లిక్కర్‌కు ఉన్న ప్రాధాన్యత స్పష్టం అవుతుంది. అయితే పట్టణంలో కొన్ని ప్రధాన కూడళ్లల్లో ఉన్న వైన్‌షాపుల వద్ద అనధికారికంగా సిట్టింగ్‌లు వేస్తూ మందుబాబులు మందేసి అక్కడే చిందెస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. దీంతో ఆ వైపుగా వెళ్లేందుకు మహిళలు, విద్యార్థినులు జంకుతున్నారు.

జిల్లా కేంద్రంలో

వైన్‌షాపుల వద్దనే

అనధికార సిట్టింగులు..

అటు వైపుగా వెళ్లేందుకు సైతం జంకుతున్న మహిళలు, విద్యార్థినులు

రోజుకు రూ.32లక్షల మద్యం అమ్మకాలు

వాస్తవానికి గద్వాల పట్టణంలో 8 వైన్‌ షాపులు, వాటిలో పర్మిట్‌ రూంలకు అనుమతి ఇచ్చారు. మద్యం కొనుగోలు చేసిన వారు పర్మిట్‌ రూంలో నిల్చొని మద్యం సేవించి వెళ్లిపోవాలి. కానీ వైన్‌షాపులలో లిక్కర్‌ కొనుగోలు చేసిన మందుబాబులు పర్మిట్‌ రూంలలో దర్జాగా సిట్టింగ్‌ వేసి అనుమతి లేకుండా చికెన్‌, మటన్‌, గుడ్లు, చేపలు వంటి మాంసం పదార్థాలు తింటున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన ఎకై ్సజ్‌శాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం.

అధికారులు ఏం చేస్తున్నారు

మందెయ్‌.. చిందెయ్‌ 1
1/1

మందెయ్‌.. చిందెయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement