
భూ వివాదాలకు ‘భూ భారతి’తో పరిష్కారం
గద్వాల: భూ వివాదాలకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నూతనంగా భూ భారతి–2025 అనే నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం–2025పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా భూ భారతి చట్టంలోని నూతనంగా పొందుపర్చిన అంశాలపై రైతులకు వివరించారు. ఎలాంటి భూవివాదాలకు తావులేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికే పూర్తి భూ యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక మార్పులు చేస్తూ కొత్త అంశాలను పొందుపర్చినట్లు తెలిపారు. భూభారతి చట్టంలో 23 సెక్షన్లు మరియు 18 నిబంధనలు పొందుపర్చినట్లు తెలిపారు. భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దులు వంటి సమగ్రమైన వివరాలతో తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఈచట్టం ద్వారా భూముల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించబడిందని, భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్కు ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న సాదా బైనామాల పరిష్కారం ఈ చట్టం ద్వారా వేగవంతం కావడంతో పాటు, వారసత్వ భూముల మ్యూటేషన్లు నిర్ణీత గడువులోపల పూర్తి చేయడం, హక్కుల సంక్రమణను అధికారికంగా నమోదు చేయడం ద్వారా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు.
చట్టంపై రైతులకు విస్తృత అవగాహన
భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ అవకాశం కల్పించినట్లు దీంతో రైతులకు న్యాయబద్దమైన మార్గం కల్పిస్తుందన్నారు. ఇంటి స్థలాలు, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులతో వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, భవిష్యత్తులో పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణను శాసీ్త్రయంగా చేస్తూనే మోసపూరితంగా పొందిన ప్రభుత్వ భూములపై హక్కుల పట్టాలను రద్దు చేసే అధికారం ఈ చట్టం కల్పించబడిందన్నారు. భూ భారతి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిలుస్తోందన్నారు. మే 1వ తేదీ నుంచి గ్రామ పాలన అధికారుల నియామకంతో భూ సమస్యలు సులభతరం అవుతుందన్నారు. గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారుల సాయంతో రైతు వేదికల వద్ద చట్టం గురించి రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. భూసమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించే భూభారతి చట్టంపై ప్రతిఒక్కరు అవగాహన ఏర్పర్చుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాస్రావు, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, సుభాన్, నీలిశ్రీనివాసులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్లో ఉన్న
సాదా బైనామాల
పరిష్కారం వేగవంతం
కలెక్టర్ బీఎం సంతోష్