ఉదయం 7నుంచే బారులు.. ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఉదయం 7నుంచే బారులు.. ఆందోళన

Sep 3 2025 4:35 AM | Updated on Sep 3 2025 4:35 AM

ఉదయం 7నుంచే బారులు.. ఆందోళన

ఉదయం 7నుంచే బారులు.. ఆందోళన

ఉదయం 7నుంచే బారులు.. ఆందోళన టోకెన్‌ తీసుకున్న వారికే..

భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి మండలం జంగేడు పీఏసీఎస్‌ ఎదుట రైతులు ఉదయం ఏడు గంటల నుంచే యూరియా కోసం బారులుదీరారు. యూరియా సక్రమంగా పంపిణీ చేయాలని ఉదయం 11గంటలకు రైతులు ఆందోళన చేయగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఒక్క రైతు కుటుంబానికి ఒక బస్తా పంపిణీ చేశారు.

రేగొండ: మండల కేంద్రంలోని ఆగ్రోస్‌కు మంగళవారం ఉదయం 444 బస్తాల యూరియా రాగా, పంపిణీ చేస్తారని తెలుసుకున్న రైతులు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే రైతులు బారులుదీరారు. రెండు రోజుల క్రితం రైతువేదికల వద్ద టోకెన్‌ తీసుకున్న వారికి మాత్రమే యూరియా పంపిణీ చేయడంతో మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement