జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు

Apr 30 2025 12:19 AM | Updated on Apr 30 2025 12:19 AM

జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు

జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు

సాక్షి, వరంగల్‌: చదువంటే మార్కులు తెచ్చుకోవడం కాదు...జీవితాన్ని నేర్చుకోవడం, పరీక్షలో ఫెయిలవడం సరిదిద్దుకోలేని తప్పేమీ కాదు...అందరూ ఎప్పుడో ఒకప్పుడూ ఫెయిల్‌ అవుతారు...కానీ పరీక్షలో మార్కులే ప్రతిభకు, సామర్థ్యానికి కొలమానం కాదు...జీవితంలో ఇంకా చాలా అవకాశాలున్నాయనే విషయాన్ని మర్చిపోతే వచ్చేది దుఃఖం, ఆవేశమే. ఇవి సాధిస్తామన్న ఆశను చంపకూడదు. వారం క్రితం వెల్లడైన ఇంటర్‌ ఫలితాల్లో తప్పిన కొందరు విద్యార్థులు క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకున్నా దరిమిలా...పదో తరగతి ఫలితాలు బుధవారం వెల్లడవుతున్న నేపథ్యంలో తమ పిల్లలతో తల్లిదండ్రులు ఓ స్నేహితునిలా...గురువులా మెదిలి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టాలి. భవిష్యత్‌పై భరోసా ఇవ్వాల్సిన అవసరముందన్న అభిప్రాయం విద్యావేత్తలు, మానసిక వైద్యనిపుణుల్లో వ్యక్తం అవుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షలకు 42,262 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ఫలితాల సమయంలో ర్యాంక్‌లు రాలేదని కొందరు...మార్కులు తక్కువ వచ్చాయని ఇంకొందరు...ఫెయిల్‌ అయ్యామని మరికొందరు మానసిక ఒత్తిడికి గురై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల కంటే కూడా వారి ఫలితాలపై తల్లిదండ్రులు ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం కూడా ఈ తరహా ఘటనలకు అవకాశం ఇస్తోంది. పిల్లల మార్కులను తల్లిదండ్రులు ప్రతిష్టగా భావించొద్దని సూచిస్తున్నారు. ఇతర విద్యార్థులతో పోల్చడం వల్ల పిల్లల మానసిక వ్యథకులోనై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుందని అంటున్నారు.

హనుమకొండ

12,010

వరంగల్‌

9,237

జయశంకర్‌

భూపాలపల్లి

6,238

3,449

3,134

8,194

మానుకోట

దీన్ని అధిగమించి సక్సెస్‌ ఫుల్‌ లైఫ్‌తో ముందుకెళ్లొచ్చు

పిల్లల మార్కులను పేరెంట్స్‌ ప్రతిష్టగా భావించొద్దు

ఫలితం ఎలా ఉన్నా ప్రోత్సహిస్తేనే బంగారు భవిష్యత్‌

పదో తరగతి ఫలితాల వేళ మానసిక, వైద్య నిపుణుల సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement