జనగామ: తెలంగాణ రన్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 6 గంటలకు బతుకమ్మకుంట వద్ద నిర్వహించనున్న 2 కేఎం, 5 కేఎం, 10 కేఎం రన్ కార్యక్రమ పోస్టర్ను మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బా లమణి శ్రీనివాస్ గురువారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల్లో ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి రన్లు ఎంతో ఉపయోగకరమని, భారీసంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కౌన్సిలర్ పాముకుంట్ల ప్రసాద్గౌడ్, రన్రేస్ డైరెక్టర్ వంగాల పురుషోత్తంరెడ్డి, వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు నారోజు రామేశ్వరచారి, పోచయ్య, కుమారస్వామి, నరేష్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.


