సంక్షేమ పథకాలను పక్కాగా అమలుచేయాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలను పక్కాగా అమలుచేయాలి

Jun 10 2025 3:44 AM | Updated on Jun 10 2025 3:44 AM

సంక్షేమ పథకాలను పక్కాగా అమలుచేయాలి

సంక్షేమ పథకాలను పక్కాగా అమలుచేయాలి

కేంద్ర బృందం సభ్యులు పుష్పలత, అంకిత్‌

జనగామ రూరల్‌: కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు చేరువయ్యేలా పక్కాగా అమలు చేయాలని కేంద్ర బృందం సభ్యులు పుష్పలత, అంకిత్‌ సూచించారు. సోమవారం వారు జనగామ మండలం వడ్లకొండ, సిద్దింకి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన, దీన్‌ దయాళ్‌ అంత్యోద య, సంసాద్‌ ఆదర్శ గ్రామ్‌ యోజన పథకాల పనులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. స్వచ్ఛ గ్రామాలే లక్ష్యమని, నిర్లక్ష్యం చేయకుండా గ్రామాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిబంధన ప్రకా రం చేపట్టాలని చెప్పారు. అంతకు ముందు వారికి గ్రామాల్లో బతుకమ్మలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ వసంత, డీపీఎం వినీతరెడ్డి, ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ సంపత్‌ కుమార్‌, ఏపీఓ భిక్షపతి, ఈసీ మాధవరెడ్డి, టీఏలు అనిల్‌, జహంగీర్‌, కార్యదర్శులు రాజశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు అనిత, జయ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement