
రేషనలైజేషన్తో ప్రాథమిక విద్య నిర్వీర్యం
టీచర్ల హేతుబద్ధీకరణ పేరుతో మరో మారు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యను అగాథంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నది. రేషనలైజేషన్ పేరిట ఉపాధ్యాయులను అయోమయానికి గురి చేస్తూ పాఠశాలల మూసివేతకు తలుపులు తెరిచింది. ఈనెల 6 నుంచి 19 వరకు ‘బడిబాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆఘ మేఘాల మీద సర్దుబాటు చేయడం ఏమిటీ. ఎంతో నమ్మకం, విశ్వాసంతో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు తాము ఏమి సమాధానం చెప్పాలి?.
– బుర్ర రమేష్, రాష్ట్ర కార్యదర్శి, ప్రధానోపాధ్యాయుల సంఘం
వర్క్ అడ్జెస్ట్మెంట్ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచుమంటూ నే వర్క్ అడ్జెస్ట్మెంట్ పేరిట ఉత్తర్వులు జారీ చేయడం సరికాదు. ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి. విద్యా ర్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని చెబుతూనే సర్దుబాటు పేరిట ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకుండా చేయడానికి పూనుకోవడం ఆందోళనకరం. ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తామని చెప్పిన సర్కారు.. ఇప్పుడేమో గత పాలకులు చేసిన విధంగానే వ్యవహరిస్తున్నది.
– రాధాకృష్ణ, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు

రేషనలైజేషన్తో ప్రాథమిక విద్య నిర్వీర్యం