వెండి కిరీటం బహూకరణ | - | Sakshi
Sakshi News home page

వెండి కిరీటం బహూకరణ

Jun 10 2025 3:44 AM | Updated on Jun 10 2025 3:44 AM

వెండి

వెండి కిరీటం బహూకరణ

పాలకుర్తి టౌన్‌: శ్రీసోమేశ్వరలక్ష్మీనర్సింహస్వామి వారికి మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెంకు చెందిన భక్తుడు ఇటుకల రాజు, శ్రావణి కుటుంబ సభ్యులు 258 గ్రాముల మిశ్రమ వెండితో తయారు చేసిన కిరీటాన్ని సోమవారం సమర్పించారు. ఈ మేరకు ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు వెల్లడించారు. కార్యక్రమలలో సూపరింటెండెంట్‌ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

పాలకుర్తి సీఐ బదిలీ

పాలకుర్తి టౌన్‌: పాలకుర్తి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్ల మహేందర్‌రెడ్డి మహబూ బాద్‌ టౌన్‌ సీఐగా బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. ఆ స్థానంలో ఎవరికీ పోస్టింగ్‌ ఇవ్వలేదు. మహేందర్‌రెడ్డి సీఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సర్కిల్‌ పరిధిలో వారానికి ఒక పోలీస్‌సేష్టన్‌ను సైకిల్‌పై సందర్శించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకు ని పరిష్కరించారు. నేరాల నియంత్రణ, ప్రజలతో సత్సంబంధాల విషయంలో కీలక ప్రాత పోషించారు. ఈ ప్రాంతంలో ఉత్తమ సేవలు అందించిన సీఐగా మహేందర్‌రెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

అంగన్‌వాడీల్లో

ఇంగ్లిష్‌, తెలుగు రైమ్స్‌

జనగామ: ‘అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇంగ్లిష్‌, తెలుగు రైమ్స్‌ నేర్పిస్తున్నాం.. రంగు రంగుల బొమ్మలు, ఆట వస్తువులతో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాం.. మీ బిడ్డను ఇందులో చేర్పించండి.. కంటికి రెప్పలా చూసుకుంటూ జ్ఞానం కల్పిస్తాం’ అంటూ ‘అమ్మమాట–అంగన్‌వాడీ’ బడిబాటలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. సోమవారం పట్టణంలోని కురుమవాడ సత్రం కాలనీలో టీచర్‌ స్వర్ణలత ఆధ్వర్యాన ఇంటింటా ప్రచారం నిర్వహించా రు. రెండున్నర ఏళ్ల వయసు నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయ ని కరపత్రాల ద్వారా తెలియజేశారు. ఇంగ్లిష్‌, తెలుగు రైమ్స్‌తో పాటు కథలు, పాటలు, సృజ నాత్మకతతో కూడిన కృత్యాలు, ప్రకృతి సందర్శన, ప్రత్యక్ష అనుభవాలు, చదవడం, రాయడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తామని వివరించారు.

సీజేఐటీలో ‘టెక్నోజిల్‌–2025’

జనగామ: జనగామ మండలం యశ్వంతాపూ ర్‌ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్‌ కళాశాలలో నేటి(మంగళవారం) నుంచి టెక్నోజిల్‌–2025 వేడుకలు ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపా ల్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం కళాశాలలో ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. మొదటిరోజు టెక్‌ ఐడియా, పేపర్‌ ప్రజంటేషన్‌, ప్రాజెక్టు ఎక్స్‌పో, రెండోరోజు సాంస్కృతిక విభాగంలో పేయింటింగ్‌, రంగో లీ, మెహందీ, స్లో బైక్‌రైడింగ్‌, ఫ్యాషన్‌ షో తదితర కార్యక్రమాలుంటాయని పేర్కొన్నా రు. టెక్నోజిల్‌ కన్వీనర్‌ సన్యాసిరావు, కోకన్వీనర్‌ జి.సరిత, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.యాకూబ్‌, స్టూడెంట్‌ కోఆర్డినేటర్‌ దివ్య, అశ్వితరా మ్‌, అనుదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

ధరలు తగ్గించాలి

జనగామ రూరల్‌: కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర సరుకులతోపాటు గ్యాస్‌ ధరలు తగ్గించి సామాన్యులను ఆదుకోవాలని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యాన నెహ్రూపార్క్‌ చౌరస్తా వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పేదలను దృష్టిలో పెట్టుకుని ధరలు తగ్గించాల్సింది పోయి పెట్టుబడీ దారులకు అనేక విధాలుగా రాయితీలు ఇస్తూ దోపడీ చేస్తున్నదని మండి పడ్డారు. అనంతరం జనర ల్‌ బాడీ సమావేశంలో కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.

వెండి కిరీటం బహూకరణ1
1/4

వెండి కిరీటం బహూకరణ

వెండి కిరీటం బహూకరణ2
2/4

వెండి కిరీటం బహూకరణ

వెండి కిరీటం బహూకరణ3
3/4

వెండి కిరీటం బహూకరణ

వెండి కిరీటం బహూకరణ4
4/4

వెండి కిరీటం బహూకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement