
సమస్యల పరిష్కారం ఎప్పుడు..?
ఈ ఫొటోలోని వృద్ధురాలి పేరు నల్ల బుచ్చమ్మ. స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త అనుమరెడ్డి పేరు మీద గ్రామంలో ఉన్న 23 ఎకరాల భూమిని కొడుకుల పేర రిజిస్ట్రేషన్ చేయించారు. ‘ఇప్పుడు కొడుకులు తనను పట్టించుకోవడం లేదు.. కనీసం ఉండానికి ఇల్లు కూడా లేదు. వృద్ధాప్యంలో బతకలేక పోతున్నాను.. కొంత భూమి ఇప్పించి ఆధారం కల్పించాలి’ అని బుచ్చమ్మ వేడుకుంది.
జనగామ రూరల్: ‘ఏళ్ల తరబడి తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదు.. ఎక్కడివక్కడే ఉన్నాయి.. మా వెతలు ఎప్పుడు తీరుతాయి’ అని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు వివిధ సమస్యలపై 64 అర్జీలు రాగా.. అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్తో కలిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్నాయక్ స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగిన చర్యలకు సూచనలు చేశారు. గ్రీవెన్స్ అనంతరం జిల్లా అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీపీఓ స్వరూప, డీఏఓ రామారావు నాయక్, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, డీసీఎస్ఓ సరస్వతి పాల్గొన్నారు.
ఏళ్ల తరబడి తిరుగుతున్నా తీరని వెతలు
గ్రీవెన్స్లో అర్జీదారుల ఆవేదన
వివిధ సమస్యలపై 64 వినతులు
స్వీకరించిన అదనపు కలెక్టర్లు
వినతుల్లో కొన్ని ఇలా..
తన 28 గుంటల వ్యవసాయ భూమికి సంబంధించి భూ రికార్డులను సవరించి పట్టాదారు పాస్పుస్తకాలు మంజూరు చేయాలని జనగామ మండలం పెంబర్తి గ్రామానికి చెందిన సంకటి పార్వతమ్మ అర్జీ పెట్టుకుంది.
తన భూములకు సంబంధించి ఆర్ఓఆర్ ప్రొసీ డింగ్లు, 1బి, 7బి రికార్డులు జారీ చేయాలని లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన ఉప్పలసాగర్ వినతిపత్రం ఇచ్చారు.
తన 29 గుంటల భూమిని అక్క కుమారుడు మోసం చేసి పట్టా చేయించుకుని ఇబ్బందులు పెడుతున్నాడు.. చర్యలు తీసుకుని భూమి ఇప్పించాలని జనగామ మండలం వెంకీర్యాల కు నీల సత్తమ్మ దరఖాస్తు పెట్టుకుంది.
ఎకరం పది గుంటల భూమి డిజిటల్ పెండింగ్లో ఉంది.. సవరించి, పీపీబీలో అందజేయాల ని లింగాలఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన సాయిలు అర్జీ పెట్టుకున్నాడు.
తన ఎకరం 20 గుంటల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించి అక్రమ పద్ధతిలో అదనంగా భూమి రికార్డు నమోదు చేయించుకున్నా రు.. న్యాయం చేయాలని తరిగొప్పుల మండలం కనీలకుంట గ్రామానికి చెందిన కలకుంట్ల నర్సింహులు వినతిపత్రం అందజేశారు.

సమస్యల పరిష్కారం ఎప్పుడు..?