కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Apr 12 2025 2:28 AM | Updated on Apr 12 2025 2:28 AM

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్‌

జనగామ రూరల్‌: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్‌ పిలుపునిచ్చారు. గావ్‌ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి నెహ్రూ పార్కు, గణేష్‌ టెంపుల్‌ వద్ద స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో పాదయాత్రల ద్వారా పార్టీ కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు బుడుగుల రమేశ్‌, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య, నాయకులు లక్ష్మినర్సయ్య, జగదీష్‌, అశోక్‌, మైపాల్‌, ఈర్ల నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement