స్టేషన్ఘన్పూర్: ఈజీఎస్ పనులను సద్వినియోగం చేసుకోవాలని రాంచీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, ఉపాధి హామీ పథకం డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ జాన్డ్రీజ్ అన్నారు. మండల పరిధి అక్కపెల్లిగూడెంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులను ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు ఈజీఎస్ పనులను బాగా వినియోగించుకుంటున్నారని తెలిపారు. సాగులో లేని భూమిని సాగులో కి తేవడం, వ్యవసాయ భూముల వద్దకు రోడ్లు వేయడం, పొలం గట్లపై కొబ్బరి, టేకు, నిమ్మ చెట్లు పెంచడం బాగుందని అభినందించారు.
ఉపాధి హామీ పథకం
డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ జాన్డ్రీజ్