
అంగన్వాడీలకు పక్కా భవనాలు
ఇబ్రహీంపట్నం: ఆంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తున్నామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలంలోని తిమ్మాపూర్లో రూ.12 లక్షలతో నిర్మించనున్న ఆంగన్వాడీ భవన నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. అద్దె ఇళ్లలో కొనసాగుతున్న కేంద్రాలకు కొత్త భవనాలను నిర్మించేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. ఆనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. కరెంట్ లేని రోజుల్లో దీపాల కింద చదువుకున్నామని, నేడు డిజిటల్ బోధన అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, మాజీ కో–ఆప్షన్ సభ్యుడు ఎలేటి చిన్నారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.