శాంతిభద్రతలను పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలను పరిరక్షించాలి

Jun 26 2025 6:51 AM | Updated on Jun 26 2025 6:51 AM

శాంతి

శాంతిభద్రతలను పరిరక్షించాలి

కోరుట్ల: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు కృషి చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. కోరుట్ల సర్కిల్‌ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. నమోదవుతున్న నేరాలు, విచారణలో ఉన్న కేసులు, సీడీ ఫైల్స్‌, పెండింగ్‌ సీసీ ఫైళ్లపై ఆరా తీశారు. పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా విచారణ ఉండాలని పోలీస్‌ సిబ్బందికి సూచించారు. రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రజలకు సైబర్‌ నేరాలు, వివిధ సామాజిక అంశాలు, ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన కల్పించాలన్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకతను గుర్తించి అన్ని చోట్ల కెమెరాలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాను గంజాయి రహితంగా మార్చడానికి మరింత కృషి చేయాలన్నారు. మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, డీసీఆర్‌బీ ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాస్‌, కోరుట్ల సీఐ సురేష్‌బాబు, ఎస్సైలు శ్రీకాంత్‌, రాంచంద్రంగౌడ్‌, శ్యామ్‌రాజ్‌, నవీన్‌, సుప్రియ పాల్గొన్నారు.

వర్షాల కోసం వరుణ గాయత్రి మహాయజ్ఞం

జగిత్యాలటౌన్‌: వర్షాలు కురవాలంటూ గాయత్రి పరివార్‌ ఆధ్వర్యంలో బుధవారం వరుణగాయత్రి యజ్ఞం నిర్వహించారు. యజ్ఞం నిర్వాహకులుగా కనపర్తి నాగభూషణం, సహాయకులుగా మంచి గంగారాం వ్యవహరించారు. నాగేశ్వర్‌రావు, పుట్టబత్తిని శంకర్‌, కనపర్తి నాగభూషణం, ఇల్లెందుల పురుషోత్తం, చింత శ్రీనివాస్‌ దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేసినట్లు ఆలయ నిర్వాహకులు కొమురవెల్లి లక్ష్మీనారాయణ తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు ప్రోత్సహించాలి

జగిత్యాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలని డీఎంఏ శివరామకృష్ణ అన్నా రు. జిల్లాకేంద్రంలోని మాతాశిశు సంక్షేమ కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. పిల్లలకు మె రుగైన వైద్యం అందించాలని, న్యూబార్న్‌ కేంద్రంలో అన్ని వసతులున్నాయని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది, ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు సమయపాలన పాటించాలన్నారు. అనంతరం లేబర్‌ రూమ్‌, న్యూబార్న్‌ కేంద్రం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో ప్రమోద్‌ కుమార్‌, ప్రో గ్రాం ఆఫీసర్లు శ్రీనివాస్‌, రవీందర్‌ ఉన్నారు.

జిల్లాకేంద్రంలో భారీ వర్షం

జగిత్యాల: జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం.. సిగ్నల్‌ లేకపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది.

నేటినుంచి పాలిసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ ఆర్ట్స్‌ అండ్‌సైన్స్‌ కళాశాలలో ప్రవేశాలకు పాలిసెట్‌కు స్లాట్‌ బుక్‌ చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 26 నుంచి 29 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్‌ అరిగెల అశోక్‌ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళాశాలలో వెరిఫికేషన్‌ ఉంటుందని, అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ ధ్రువపత్రాలు, జిరాక్స్‌లతో హాజరు కావాలని సూచించారు. జూలై ఒకటోతేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు సమర్పించాలన్నారు. వివరాలకు అడ్మినిస్ట్రేటర్‌ మధుకర్‌ 81215 13671 సంప్రదించాలని సూచించారు.

శాంతిభద్రతలను   పరిరక్షించాలి
1
1/3

శాంతిభద్రతలను పరిరక్షించాలి

శాంతిభద్రతలను   పరిరక్షించాలి
2
2/3

శాంతిభద్రతలను పరిరక్షించాలి

శాంతిభద్రతలను   పరిరక్షించాలి
3
3/3

శాంతిభద్రతలను పరిరక్షించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement