సమస్యల ఒడి | - | Sakshi
Sakshi News home page

సమస్యల ఒడి

Jun 11 2025 8:58 AM | Updated on Jun 11 2025 8:58 AM

సమస్య

సమస్యల ఒడి

ఇది కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్‌లోగల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల. అదనపు తరగతి గదులకు స్లాబ్‌ వరకు నిర్మాణం చేపట్టి వదిలేశారు. ఇందులో కూర్చోవాలంటే విద్యార్థులకు ఇబ్బందికరంగానే ఉంటుంది. త్వరితగతిన పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
● స్వాగతం పలుకుతున్న ఇబ్బందులు ● టాయిలెట్స్‌కు మరమ్మతు కరువు ● పారిశుధ్యమూ అంతంతే.. ● రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
మన ఊరు మన బడి కింద ఎంపికై న పాఠశాలలు : 277విద్యార్థుల సంఖ్య : 57,552బడ్జెట్‌ : రూ.1.19కోట్లు పూర్తయిన స్కూళ్లు : 48మంజూరైన కాంపోనెంట్స్‌ : 1087పూర్తయిన కాంపోనెంట్స్‌ : 446

చదువుల

బడి..

ఇది మల్యాల మండలకేంద్రంలోని ఒడ్డెరకాలనీలోని మండల పరిషత్‌ పాఠశాలలో గల టాయిలెట్స్‌. ఈ టాయిలెట్స్‌ చుట్టూ చెట్లపొదలతో నిండిపోయాయి. పారిశుధ్యం చేయించాల్సిన అవసరం ఉంది. స్కూల్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో పారిశుధ్యం చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

జగిత్యాల: జిల్లాలో పాఠశాలలు ఈనెల 12 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలల్లో విద్యను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేక రకాల చర్యలు సైతం చేపట్టింది. ఇటీవలే ఎమ్మార్సీల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కల్పించింది. ఈసారి పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా 4వ స్థానం సాధించడంతో ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతోంది. అయితే మౌలిక వసతులే ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మన ఊరు మన బడి పథకం కింద రూ.1.19 కోట్లు మంజూరయ్యాయి. ఈ పథకం కింద జిల్లాలో 277 స్కూళ్లు ఎంపికై నప్పటికీ 48 స్కూళ్లు మాత్రమే కంప్లీట్‌ అయ్యాయి. అలాగే టాయిలెట్స్‌, కలర్స్‌, బెంచీలు, కిచెన్‌షెడ్స్‌ (కాంపోనెంట్స్‌) తదితర 1087 మంజూరు కాగా.. 446 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే అమ్మ ఆదర్శ పథకం కింద 517 ఎంపిక కాగా.. 282 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా మరమ్మతు చేయకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

బడిబాట ప్రారంభం

ఈనెల ప్రారంభం నుంచే జిల్లాలో బడిబాట కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నా ణ్యమైన విద్య అందుతోందని, ప్రతిఒక్కరూ పాఠశాలలకు రావాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి బడీడు పిల్లలను గుర్తిస్తున్నారు. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.

పాఠ్య పుస్తకాలు రాక

జిల్లాకు 3,80,760 పుస్తకాలు అవసరం కాగా.. ఇప్పటి వరకు 3,50,920 పుస్తకాలు మాత్రమే వచ్చాయి. వాటిని ఆయా స్కూళ్లకు పంపిణీ చేశా రు. అలాగే జిల్లాలో మొత్తం 57,552 మంది విద్యార్థులు ఉండగా.. 83 శాతం మందికి యూనిఫామ్స్‌ అందించారు. ఇంకా 17 శాతం వరకు విద్యార్థులకు యూనిఫామ్స్‌ అందించాల్సి ఉంది.

పారిశుధ్యం అంతంతే..

ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో అమ్మ ఆదర్శ పథ కం కింద స్కాంవెంజర్లను ఏర్పాటు చేసుకున్నప్పటి కీ కొన్నిచోట్ల పారిశుధ్యం అంతంతగానే ఉంది. టా యిలెట్స్‌ పూర్తిగా పిచ్చిమొక్కలతో నిండిపోయా యి. పాఠశాలల ఎదుట ఏపుగా ముళ్లపొదలు నిండిపోయాయి. అధికారులు స్పందించి పారిశుధ్యం చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలు

గతంలో ఉపాధ్యాయుల హాజరు నమోదు చేసేందుకు బయోమెట్రిక్‌ ఏర్పాటు చేసినప్పటికీ అది ఆశించిన మేరకు ఫలితం ఇవ్వలేదు. దీంతో దానిని ఎత్తివేశారు. విద్యార్థులకు ఫేస్‌ రికగ్నైజ్డ్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అమలు చేస్తున్నారు. తాజాగా.. ఉపాధ్యాయులకూ ఈ విధానం తీసుకురావాలని భావించిన ఉన్నతాధికారులు.. ఈ ఏడాది నుంచే అమలవుతుందని చెబుతున్నారు. కొంత మంది ఉపాధ్యాయులు స్కూల్‌కు వెళ్లకపోవడం, అటెండెన్స్‌ వేసుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో ఎఫ్‌ఆర్‌ఎస్‌ సిస్టమ్‌ తప్పనిసరి అయ్యింది. ఈ విధానం ద్వారా పూర్తిస్థాయిలో పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఈ చిత్రం కోరుట్ల పట్టణంలోని కటికెవాడలోగల ప్రాథమిక ఉన్నత పాఠశాల. గది కూలిపోయి శిథిలావస్థకు చేరింది. ఇప్పటివరకు మరమ్మతు చేయించలేదు. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుంది. అన్ని పాఠశాలల్లో వసతులు కల్పించాం. విద్యార్థులకు మంచి విద్య అందించాలన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులకు అన్ని అంశాలపై శిక్షణ ఇచ్చాం. ప్రతిరోజు ఉపాధ్యాయులు ఎలా చెబుతున్నారని పర్యవేక్షిస్తాం. మంచి ఫలితాలు తీసుకుచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.

– రాము, డీఈవో

సమస్యల ఒడి1
1/3

సమస్యల ఒడి

సమస్యల ఒడి2
2/3

సమస్యల ఒడి

సమస్యల ఒడి3
3/3

సమస్యల ఒడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement