
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలి
● డీఎంహెచ్వో ప్రమోద్కుమార్
మెట్పల్లి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు అయ్యేలా చూడాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలతో సమావేశమయ్యారు. 100 శా తం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే అయ్యేలా గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. గర్భిణులకు పండ్లు అందించారు. మెట్పల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లను తనిఖీ చేశారు. జిల్లా మాతా శిశుప్రొగ్రాం అధికారి జైపాల్రెడ్డి, మెట్పల్లి మండల వైద్యాధికారి అంజిత్రెడ్డి పాల్గొన్నారు.
వికసిత్ కృషి సంకల్ప్ ద్వారా రైతులకు అవగాహన
సారంగాపూర్: కేంద్ర ప్రభుత్వ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ద్వారా రైతులకు వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాల యం శాస్త్రవేత్త పద్మజ తెలిపారు. బీర్పూర్ మండలం చిత్రవేణిగూడెంలో రైతులకు అవగా హన కల్పించారు. పంటల ఉత్పత్తిని పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానం, పంట మార్పిడి, యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. ఎ రువుల వినియోగం, చీడపీడలు, తెగుళ్ల ని వారణకు రైతులు వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలన్నారు. ఏడీఏ తిరుపతి, ప్రదీప్రెడ్డి, ఏఈవోలు పాల్గొన్నారు.
అంగన్వాడీకేంద్రాల్లోనే పోషకాహారం
మల్యాల: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహారం అందిస్తూ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్తుతున్నారని, ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్యా బోధిస్తున్నామని మ ల్యాల సీడీపీఓ వీరలక్ష్మి అన్నారు. మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం అమ్మమాట.. అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి కార్యక్రమం ప్రాధాన్యతను తల్లులు, ఆరోగ్యలక్ష్మీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీ టీచర్లకు వివరించారు. సూపర్వైజర్ శారద, అంగన్వాడీ టీచర్లు స్వప్న, రాణి, తల్లులు పాల్గొన్నారు.
తాండ్య్రాలకు బస్సు సౌకర్యం కల్పించాలి
కథలాపూర్: మండలంలోని తాండ్య్రాల గ్రామానికి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరుట్ల ఆర్టీసీ అధికారులకు మహిళలు వినతిపత్రం ఇచ్చారు. తాండ్య్రాల మీదుగా గంభీర్పూర్కు బస్సు వెళ్తున్నప్పటికీ అందులో ప్రయాణికుల రద్దీ ఉండటంతో తాండ్య్రాలలో బస్సులు ఆపడంలేదన్నారు. మహిళలు ఫుట్ బోర్డు ప్రయాణిం చేయాల్సి వస్తుందన్నారు. అధికారులు చొరవ చూపి ప్రత్యేకం బస్సు సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.
మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయాలి
జగిత్యాలరూరల్:జిల్లాలోని మహిళా సంఘాల బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఐకేపీ ఏపీడీ చరణ్దాస్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం ఐకేపీ కార్యాలయంలో మహిళా సంఘాల పదాధికారులకు శిక్షణ కల్పించారు. అన్ని మండలాల్లో కొత్తగా ఎన్నికై న మహిళా సంఘాల సభ్యులకు రెండు రోజుల శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. విధులు, బాధ్యతలు, సంఘాల నిర్వహణ, కట్టుబాట్లు, ఆర్థిక లావాదేవీలపై శిక్షణ ఉంటుందన్నారు. ప్రభుత్వం ద్వారా అందే సేవలను సంఘాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా శాఖల సమన్వయంతో స్వశక్తి సంఘాల పర్యవేక్షణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలి