‘సాక్షి’పై దాడి అప్రజాస్వామికం | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి’పై దాడి అప్రజాస్వామికం

Jun 11 2025 8:58 AM | Updated on Jun 11 2025 8:58 AM

‘సాక్షి’పై దాడి అప్రజాస్వామికం

‘సాక్షి’పై దాడి అప్రజాస్వామికం

● ఏపీ ప్రభుత్వం తీరు మార్చుకోవాలి ● కొమ్మినేని అరెస్టు గర్హనీయం ● జర్నలిస్టుల సంఘాల నిరసన

కరీంనగర్‌: ఏపీలో ‘సాక్షి’ దినపత్రిక, టీవీ చానళ్ల కార్యాలయాలపై టీడీపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలు అప్రజాస్వామికమని, మీడియా స్వేచ్ఛను హరించడం రాజ్యాంగ విరుద్దమని టీయుడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్‌, కొయ్యడ చంద్రశేఖర్‌, ‘సాక్షి’ దినపత్రిక ఉమ్మడి జిల్లా బ్యూరో ఇన్‌చార్జి భాషబోయిన అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. ఏపీలో ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు, సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును నిరసిస్తూ మంగళవారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీనియర్‌ జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం మీడియాపై కక్ష సాధింపులను తీవ్రంగా ఖండించారు. ఇటీవల ‘సాక్షి’ ఎడిటర్‌ ధనుంజయ్‌ రెడ్డి మీద కేసులు బనాయించడం, తాజాగా కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం, సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్ప డటం భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగా ఉందని మండిపడ్డారు. రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు తిలోదకాలు ఇచ్చేలా ఉన్న ఏపీ ప్రభుత్వ చర్యలను దేశవ్యాప్తంగా మీడియా ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. ఏపీ సర్కారు పత్రికా కార్యాలయాలపై, మీడియా ప్రతినిధులపై దాడులు కొనసాగిస్తే అదేస్థాయిలో నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర, జిల్లా నాయకులు ఎలగందుల రవీందర్‌, బల్మూరి విజయసింహారావు, ఈద మధుకర్‌రెడ్డి, ఏలేటి శైలేందర్‌రెడ్డి, జీఎస్‌ ఆనంద్‌తో పాటు సీనియర్‌ జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement