రాయికల్‌ బల్దియా అభివృద్ధికి రూ.15 కోట్లు | - | Sakshi
Sakshi News home page

రాయికల్‌ బల్దియా అభివృద్ధికి రూ.15 కోట్లు

Jun 11 2025 8:58 AM | Updated on Jun 11 2025 8:58 AM

రాయికల్‌ బల్దియా అభివృద్ధికి రూ.15 కోట్లు

రాయికల్‌ బల్దియా అభివృద్ధికి రూ.15 కోట్లు

● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

రాయికల్‌: రాయికల్‌ బల్దియా అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మోర హన్మండ్లు, సింగిల్‌ విండో చైర్మన్‌ ఏనుగు మల్లారెడ్డి, యువజన సంఘాల నాయకులు రాంమూర్తి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గన్నె రాజిరెడ్డి ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నిధులకు త్వరితగతిన టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన గౌడ సంఘం నాయకులు

జగిత్యాలరూరల్‌: జగిత్యాల అర్బన్‌ మండలం హస్నాబాద్‌కు చెందిన గౌడ యువజన సంఘం సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. సంఘం భవనానికి గతంలో నిధులు మంజూరయ్యాయని, బోర్వెల్‌, ప్రహరీకి కూడా సహకరించాలని కోరారు. నాయకులు వెంకటరాజం, జలేందర్‌, ధర్మరాజు, నాగరాజు, సత్తయ్య, గణేశ్‌, కృష్ణ పాల్గొన్నారు.

శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలి

జగిత్యాల: నూకపల్లి వద్దగల డబుల్‌బెడ్‌రూం ఇందిరమ్మ కాలనీలో శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కాలనీవాసులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో వసతుల కల్పనకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. నరేందర్‌, రమేశ్‌, స్వామి, విజయ్‌, ఖలీల్‌, శ్రీను పాల్గొన్నారు.

ఓల్డ్‌పెన్షన్‌ స్కీం వర్తింపజేసేలా చూడాలి

తెలంగాణ రాష్ట్ర పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులు ఓల్డ్‌పెన్షన్‌ స్కీం వర్తింపజేసేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. నూకపల్లిలోని శ్రీజ్ఞానద్యాన విజ్ఞాన సరస్వతి ఆలయ కమిటీ సభ్యులు కలిసి 11వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement