
ఎల్లమ్మ తల్లికి బోనాలు
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. జాతర సందర్భంగా మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. అమ్మవారికి బెల్లం, పుట్నాలు, కల్లు, కోళ్లు నైవేద్యంగా సమర్పించారు. తమను సల్లంగా చూడు తల్లి అంటూ వేడుకున్నారు. అనంతరం సహంపక్తి భోజనాలు చేశారు. భక్తుల ద్వారా ఆలయానికి రూ.82,887 ఆదాయం, 10 గ్రాముల మిశ్రమ వెండి, 9 అమెరికా డాలర్స్ వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.