
రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఏర్పాట్లు
జగిత్యాల: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ లత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతిశాఖకు చెందిన అధికారులు, సిబ్బంది వేడుకలకు హాజరు కావాలని, వారికి సంబంధించిన ఫ్లాగ్ ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఏఎన్ఎం ఆధ్వర్యంలో వైద్య బృందాలతో శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానపత్రాలు అందేలా చూడాలన్నారు. మెప్మా ఆధ్వర్యంలో స్వశక్తి సంఘాల ప్రతినిధులు హాజరయ్యేలా చూడాలని, ముఖ్య అతిథి అందించే సందేశం రూపొందించి అందించాలన్నారు. అదనపు ఎస్పీ భీంరావు ఉన్నారు.
రైతులు ఆందోళన చెందొద్దు
రాయికల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసిన రైతులు ఆందోళన చెందవద్దని, ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. శుక్రవారం రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని ఐకేపీ కేంద్రం నిర్వాహకులకు సూచించారు. మైతాపూర్ గ్రా మంలోని శివమణి రైస్మిల్లును సందర్శించి కొ నుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని త్వ రితగతిన దిగుమతి చేసుకోవాలని సూచించారు. ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్ వెంట ఉన్నారు.
● అదనపు కలెక్టర్ బీఎస్.లత