
పారిశుధ్య కార్మికుల సంరక్షణ అందరి బాధ్యత
జగిత్యాల: పారిశుధ్య కార్మికుల సంరక్షణ అందరి బాధ్యత అని డీఆర్డీవో పీడీ రఘువరణ్, డీపీవో మదన్మోహన్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో యూనిసెఫ్ ఆధ్వర్యంలో పంచాయతీ, పారిశుధ్య కార్మికులకు శిక్షణ నిర్వహించారు. పారిశుధ్య కార్మికులకు బీమా సౌకర్యం కల్పింస్తామని, ఆరోగ్య పరీక్షలు తరుచూ చేపడతామని అన్నారు. యూనిసెఫ్ నిర్వాహకులు మాట్లాడుతూ.. కార్మికులు జీవన అలవాట్లు, పద్ధతులు మార్చుకోవాలని, ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. తడి, పొడి చెత్త నిర్వహణ ఎలా చేయాలి..? పారిశుధ్య నిర్వహణ ఎలా చేపట్టాలన్న అంశంపై శిక్షణ కల్పించారు. అనంతరం వారిని సత్కరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.